రాధేశ్యామ్ … ’70ల నాటి కాలాన్ని మరోసారి చూసొద్దాం’ .. ఫోటో వైరల్ !

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా మూవీ ‘రాధేశ్యామ్‌’ షూటింగ్ ఫైన‌ల్ స్టేజ్‌కు వ‌చ్చింది. దాదాపు వారం రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. ఇప్పుడు పెండింగ్ పార్ట్‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. కృష్ణంరాజు, ప్ర‌భాస్ క‌లిసి ఉండే స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ కృష్ణంరాజు రాధేశ్యామ్ సెట్స్ నుంచి కిర్రాక్ ఫొటోను త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు.

రాధేశ్యామ్‌ షూటింగ్‌ లొకేషన్‌ లో ప్రభాస్‌తో దిగిన ఓ ఫొటోను షేర్‌ చేశారాయన. ఈ ఫొటో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. మ‌రో వైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ‘జూలై 30న ఈ సినిమా చూస్తూ కాలంలో వెనక్కి వెళ్దాం’ అని క్యాప్షన్‌ చేశారు. 1970లో జరిగే కథాంశంతో రూపొందుతున్న చిత్రం రాధేశ్యామ్‌. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే లవ్‌స్టోరీ ఇది. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక.

ఇక సినిమా ప్రభాస్‌ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్‌ పాత్రలో కనిపించనున్నారు. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో జూలై 30న ఈ సినిమా రిలీజ్‌ చేస్తున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది.