SaReGaMaPa Parvathi: సరిగమప షో లో పార్వతి పాట పడుతుండగా ఆపిన కోటి..!

SaReGaMaPa Parvathi: జీ తెలుగులో ప్రసారం అవుతున్న రియాలిటీ షోలలో సరిగమప సింగింగ్ షో కూడా ఎంతో మంచి ప్రేక్షకాదరణ పొందింది. మారుమూల గ్రామాలలో ఉంటూ ఎంతో ప్రతిభ ఉన్న సింగర్స్ ని ఈ వేదిక ద్వారా సరిగమప షో అందరికీ పరిచయం చేసింది.ఈ షో ద్వారా పార్వతి అనే యువతి తన పాటతో మంచి గుర్తింపు పొందింది. పేదరికం నుంచి వచ్చిన పార్వతికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎంతో మంది ముందుకు వచ్చారు.

ఇటీవల స రి గ మ ప సింగింగ్ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమో లో సింగర్ పార్వతి పాట పాడుతుండగా కోటి గారు మధ్యలో ఆపేశారు. పార్వతి “మగువ మగువ” అనే పాట పాడుతున్న సమయంలో శృతి ఏది? రాగమేది? అంటూ పాట ఆపటంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.అయితే ఈ విషయంలో పార్వతి పొరపాటు ఏమీ లేదని ఇదంతా టెక్నికల్ ప్రాబ్లం అని తెలిసింది.

కొంత సమయం తర్వాత పార్వతి మళ్లీ ఆ పాట ఎంతో అద్భుతంగా పాడింది. పార్వతి పాటను మెచ్చిన ఎంతోమంది ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఇటీవల ఆమెకు పళ్లకు సంబంధించిన సర్జరీ చేయడానికి కూడా ఒక డాక్టర్ ముందుకు వచ్చారు. ఇక ప్రముఖ సినీ నటి అయిన రోజా రమణి గారు పార్వతి పాటని మెచ్చి ఆమెకు సన్మానం చేయాలని నిర్ణయించుకున్నారట. అయితే పబ్లిక్ గా కాకుండా తన ఇంట్లోనే పార్వతికి సన్మానం చేస్తానని.. పార్వతిని తన ఇంటికి తీసుకురమ్మని కోటి గారినీ కోరింది. ఈ విషయాన్ని కోటి గారు ఇటీవల బయట పెట్టారు. పార్వతిని రోజా రమని గారింటికి తీసుకెళ్లడానికి ఒప్పుకున్నాడు.