ఉప్పెన కంటే ముందు కొండపొలం .. క్రిష్ ప్లాన్ కి మెగా ఫ్యామిలీ షాక్ ..?

ఉప్పెన.. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన డెబ్యూ సినిమా. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మించారు. సుకుమార్ దగ్గర అసోసియేట్ గా చేసిన బుచ్చిబాబు సానా ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఉప్పెన సినిమాలోని సాంగ్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాదు ఉప్పెన లోని నీ కన్ను నీలిసముద్రం రికార్డ్ ని క్రియేట్ చేసింది. దాంతో మెగా మేనల్లుడు డెబ్యూ సినిమా అయిన ఉప్పెన భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. కాని కరోనా కారణంగా ఉప్పెన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేకపోయారు.

Sai Tej is happy over DSP's melody for bro -

ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ రెండవ సినిమా సెట్స్ మీదకి వచ్చింది.. షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. కరోనా తో అందరూ షూటింగ్ మొదలు పెట్టాలంటే మేకర్స్ అందరూ భయపడ్డారు. కాని క్రిష్ మాత్రం కేవలం 45 రోజుల్లో ఈ సినిమాని కంప్లీట్ చేసి ఇండస్ట్రీ మొత్తానికి షాకిచ్చాడు. అంతేకాదు ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. క్రిష్ కేవలం షూటింగ్ మాత్రమే కంప్లీట్ చేయడం కాదు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా కంప్లీట్ చేసేశాడట.

Vaishnav Tej's Next With Krish Set On Forest Backdrop? - Tupaki English |  DailyHunt

త్వరలో ప్రమోషన్స్ ని మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకి కొండపొలం అన్న టైటిల్ పరిశీలనలో ఉండగా మేకర్స్ దాదాపు అదే టైటిల్ ని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట. కాగా న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1 న ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసే ప్లాన్ లో ఉన్నారని అంటున్నారు. అంతేకాదు ఇప్పుడు క్రిష్ మరో షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా ఉప్పెన కంటే ముందే క్రిష్ వైష్ణవ్ తేజ్ సెకండ్ మూవీ ని రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. అయితే ఇది మెగాస్టార్ చిరంజీవి తో పాటు వైష్ణవ్ తేజ్ అన్న సాయి ధరం తేజ్ కెరీర్ లో కూడా సెకండ్ మూవీ ముందు రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. కాబట్టి క్రిష్ – వైష్ణవ్ తేజ్ మూవీ విషయంలో కూడా అదే మ్యాజిక్ జరగబోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారట.