మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకల్లోస్పెషల్ గెస్ట్‌గా కింగ్ నాగార్జున‌.. వైర‌ల్‌గా మారిన ఫొటోలు

టాలీవుడ్ అయినా.. బాలీవుడ్ అయినా.. అగ్ర హీరోల కుటుంబాలు తరచూ కలుస్తూ ఉంటారు. ఒకరి సినిమా ప్రమోషన్స్ కి మరోకరు హాజరవుతూనే ఉంటారు. అలాగే పండుగలకి.. ఈవెంట్స్ కి ఫ్యామిలీతో కలిసి సెలెబ్రేట్ చేసుకుంటారు. అలాగే ప్రస్తుతం స్టార్స్ కీ యూనియన్ చాలా కామన్ గా మారింది. స్టార్ డమ్ ఉన్న యాక్టర్స్ కుటుంబాలు కలిస్తే ఇక ఫ్యాన్స్ కి పండగే. అందులోనూ టాలీవుడ్ లో అగ్ర కుటుంబంలో హీరోల కలయిక అంటే ఇంకాస్త క్రేజ్ ఉంటుంది. అందులో భాగంగానే ఈ ఏడాది సంక్రాంతి పండుగను మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ సెలెబ్రేట్ చేసుకున్నారు.

చిరంజీవి ఇంట్లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో కింగ్ నాగార్జున అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా పండుగ విందు కార్యక్రమంలో పాల్గొంటూ కుటుంబంతో కలిసి పండుగ సెలెబ్రేట్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునతో సహా, మెగా ఫ్యామిల హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్. సాయితేజ్, అల్లు శిరీష్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ సైతం ఈ ఏడాది సంక్రాంతి పండుగ అద్దిరిపోయిందంటూ.. ఈ రెండు కుటుంబాల కలయిక ప్రేక్షకులకు, అభిమానులకు ఆనందాన్నిస్తుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

కింగ్ నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో బిజీ గా ఉన్నారు. కరోనా కష్టకాలం తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగవుతుండటంతో మెగా ఫ్యామిలీలో అగ్ర హీరోలు, అక్కినేని వారసులు సినిమా షూటింగ్స్ తో బిజీ గా ఉన్నారు. దీంతో పాటు ప్రస్తుతం తమ సినిమా ప్రమోషన్స్ తో ఎక్కువగా సోషల్ మీడియాలో తమ అభిమానుల్ని ఎంటర్ టైన్ చేస్తున్నారు.