రోడ్డు మీద చొక్కా చొక్కా పట్టుకునేలా ఉన్న తెలుగు టాప్ ప్రొడ్యూసర్‌లు?

టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు బడా నిర్మాతల మధ్య వివాదం ముదురుతోంది. సీనియర్ నటుడు వీకే నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా, కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా పరిచయం చేయడానికి ప్రారంభించిన చిత్రం ‘ఐనా ఇష్టంనువ్వు’. చంటి అడ్డాల నిర్మాతగా 2015లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు. అయితే ఈ సినిమా ఆగడంతో ఆ తర్వాత ‘నందిని నర్సింగ్‌ హోమ్‌’ చిత్రంతో, రామ్‌ హీరోగా విడుదలైన ‘నేను శైలజ’ చిత్రంతో కీర్తి సురేష్‌ టాలీవుడ్‌కు పరిచమయ్యారు. అయితే ఈ విషయాలను పక్కకు పెడితే.. ఐదేళ్ల తర్వాత ‘ఐనా ఇష్టంనువ్వు’ చిత్రం విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

అయితే సినిమా విడుదలకు సిద్దం అవుతున్న తరుణంలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. నిర్మాత చంటి అడ్డాల తనకు ‘ఐనా నువ్వంటే ఇష్టం’ అనే చిత్రాన్ని అమ్మాడని అంతేకాకుండా తనతో పాటు మరో ముగ్గురికి అదే సినిమాను మరో ముగ్గురికి అమ్మి మోసం చేశాడని నట్టి కుమార్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ‘నేను అతనికి సినిమా కోసం చెక్కులు ఇచ్చాను. చంటి అడ్డాల ఫిల్మ్ చాంబర్‌ను మ్యానేజ్ చేశాడు. సినిమా ఇంకా పది రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. కీర్తీ సురేష్‌కు ప్రస్తుతం డిమాండ్ పెరిగింది. ఆమెకు పేమెంట్ చేయలేకే చంటి అడ్డాల మోసం చేస్తున్నాడు. అతనిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను’ అని నట్టి కుమార్ తెలిపాడు.

ఇక ఇదే ఘటనపై చంటి అడ్డాల సైతం నట్టి కుమార్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సినిమా కొంటానని నట్టి కుమార్ డబ్బులు ఇవ్వలేదని ఆరోపించాడు. చెక్కులు ఇచ్చాడని అయితే ఇప్పుడే ప్రొసీడ్ అవ్వొద్దని చెప్పాడని తెలిపాడు. తమ మధ్య చేసుకున్న అగ్రిమెంట్ ను కూడా ఫిల్మ్ ఛాంబర్ క్యాన్సిల్ చేసిందని తెలిపాడు. అయినా రిలీజ్ చేసిన పోస్టర్ పై నట్టి కుమార్ తన పేరును వేసుకున్నాడని వెల్లడించారు. నట్టి కుమార్ లాంటి ఫ్రాడ్ ను నమ్మడమే తాను చేసిన తప్పు అంటూ మండిపడ్డాడు. పోలీసులు నట్టి కుమార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఇక ఈ సినిమా పూర్తయి విడుదలయ్యే సరికి ఈ ఇద్దరు నిర్మాతల మధ్య వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది.