Karthikeya : జాక్ పాట్ కొట్టిన కార్తికేయ…. పెద్ద ప్రొడక్షన్ హౌస్ తో సినిమా ఛాన్స్…!

Karthikeya : ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన హీరోల్లో కొద్ది మంది మాత్రమే విజయం సాధించి మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకుంటారు.అలాంటి హీరోల్లో నాని, విజయ్ దేవరకొండ, శ్రీవిష్ణు, కార్తికేయ, విశ్వక్ సేన, నవీన్ పోలిశెట్టి ఉన్నారు. ఇక వీరిలో నాని విజయ్ లు బాగానే సక్సెస్ అయి మంచి మార్కెటును సంపాదించుకున్నారు. ఇందులో విజయ్ ఏకంగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.

ఇక కార్తికేయ ప్రేమతో మీ కార్తీక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఈ సినిమా నటుడిగా మంచి పేరు తెచ్చింది కానీ గుర్తింపు తెచ్చి పెట్టలేకపోయింది. ఆ తర్వాత ఆయన చేసిన ఆర్ఎక్స్ 100 సినిమా అద్భుతమైన విజయం సాధించడమే కాకుండా తెలుగులో ఒక బోల్డ్ అటెంప్ట్ గా నిలిచిపోయింది. ఇక ఆ తర్వాత తీసిన సినిమాలు గుణ, చావు కబురు చల్లగా, రాజా విక్రమార్క సినిమాలు మంచి పేరు తెచ్చాయి. ఇందులో రాజా విక్రమార్క లో కార్తికేయ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఆర్ఎక్స్ 100 సినిమా చేసిన మరో ఏడాదిలోనే ఆయన చేసిన నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. హిప్పీ, గుణ 369, 90 ml లాంటి సినిమాల్లో హీరోగా నటించగా నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ అనే సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. కరోనా కాలం లో కూడా షూటింగులలో జరిపి, కార్తికేయ 2021 వ సంవత్సరంలో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కిన వలిమై సినిమాలో నరేన్ అనే ఒక డ్రగ్స్ కీ బానిస అయిన విలన్ పాత్రలో నటించి కేవలం తెలుగు- తమిళ ప్రేక్షకులను కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరినీ మెప్పించాడు.

ప్రభాస్ సన్నిహితులకు సంబంధించిన యు.వి.క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు కార్తికేయ హీరోగా ఒక సినిమా చేస్తున్నట్టు ప్రకటించింది యు.వి.ప్రొడక్షన్స్ సంస్థ. కార్తికేయ హీరోగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా ప్రశాంత్ రెడ్డి చందదపు అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుందని ప్రొడక్షన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇలా కార్తికేయ ఒక్కో మెట్టు ఎక్కుతుంది టాప్ హీరో రేంజ్ కీ ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు.