నా మొగుడు తన స్నేహితులతో పడుకోమన్నాడు: కరిష్మా కపూర్

karishma kapoor revealed her ex husband cruel behavior

బాలీవుడ్ అలనాటి టాప్ హీరోయిన్ కరిష్మా కపూర్ తన మాజీ భర్త మీద చేసిన సంచలన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఒకప్పుడు వరుసగా విజయవంతమైన సినిమాలు చేసి హిందీ చిత్ర పరిశ్రమలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది కరిష్మా. అత్యంత విజయవంతమైన కథానాయికగా బాలీవుడ్ లో ఆమెకి మంచి గుర్తింపు ఉంది. కానీ ఆమె తన వైవాహిక జీవితంలో అనేక ఆటుపోట్లు అనుభచించింది. చివరికి తన 13 సంవత్సరాల వివాహ బంధాన్ని 2016లో విడాకుల ద్వారా తెంచేసుకుంది.

karishma kapoor revealed her ex husband cruel behavior
karishma kapoor revealed her ex husband cruel behavior

ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కరిష్మా మాట్లాడుతూ… ఆమె వివాహ జీవితం గురించి, తన భర్త సంజయ్ కపూర్ దారుణాల గురించి బయట పెట్టింది. వివాహం తరువాత తన జీవితం పూర్తిగా మారిందని, ప్రతి రోజు ఆమె ఆ వివాహ జీవితంలో బాధపడినట్లుగా వెల్లడించారు. హనీమూన్ సమయంలో భర్త సంజయ్ కపూర్ తనను స్నేహితులతో పడుకోమని బలవంతం చేశాడని, ఆమె నిరాకరించటంతో దారుణంగా కొట్టినట్లుగా పేర్కొన్నారు. కరిష్మాతో వివాహం తరువాత కూడా సంజయ్ తన మొదటి భార్యతో శారీరక సంబంధంలో ఉన్నారని వెల్లడించారు. ఆమె ఈ విషయం తెలుసుకుని, సంజయ్‌ను ప్రశ్నించగా, అతను తన తప్పును అంగీకరించకుండా ఆమెపై దాడి చేయడం ప్రారంభించాడట. ఎంతో భరించానని, కానీ మార్పు రాలేదని అందుకే ఇక విడాకులు తీసుకుని ఆ నరకం నుండి బయట పడ్డానని కరిష్మా తన మనసులోని బాధని బయటపెట్టారు.