వామ్మో ప్రియుడికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన జోర్దార్ సుజాత… ఎన్ని లక్షలు ఖర్చు చేశారో తెలుసా?

బుల్లితెర ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న వారిలో రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాత ఒకరు. వీరిద్దరూ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే జోర్దార్ సుజాత బిగ్ బాస్ సీజన్ ఫోర్ 4 ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ విధంగా బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్ ఉపయోగించుకొని ఈమె ప్రస్తుతం కెరియర్లో దూసుకుపోతున్నారు. ఒకవైపు జబర్దస్త్ కార్యక్రమంలో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన జోర్దార్ సుజాత రాకింగ్ రాకేష్ ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.వీరిద్దరి ప్రేమకు పెద్దల అంగీకారం తెలిపారని త్వరలోనే వీరిద్దరి పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే జోర్దార్ సుజాత తన ప్రియుడికి ఎంతో విలువైన బహుమతి ఇచ్చినట్టు యూట్యూబ్ వీడియో ద్వారా వెల్లడించారు.

రాకేష్ తనకు కోపం ఎక్కువగా వస్తే ఫోన్ పగలగొట్టే అలవాటు ఉందని తెలియజేసిన సుజాత తనకు లక్ష రూపాయలు ఖర్చు చేసి ఫోన్ గిఫ్ట్ ఇచ్చినట్లు వెల్లడించారు. రాకేష్ మనసుకు తాను దగ్గరైన వ్యక్తి కనుక నేను గిఫ్ట్ గా ఇచ్చిన సెల్ ఫోన్ పగల కొట్టాలి అంటే ఆలోచిస్తాడు. అందుకే తనకు బహుమతిగా లక్ష రూపాయల విలువ చేసే సెల్ ఫోన్ బహుమతిగా ఇచ్చానని అలాగే స్మార్ట్ వాచ్ కూడా బహుమతిగా ఇచ్చినట్లుగా వెల్లడించారు. వీటి ధర లక్షా ఇరవై వేల రూపాయలని రాకింగ్ రాకేష్ తెలిపారు. ఇక ప్రస్తుతం వీరిద్దరూ కలిసి తన స్నేహితులతో గోవా వెకేషన్ వెళ్లి ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.