కృష్ణ చివరి చూపుకు నోచుకోని రమేష్ బాబు కుమారుడు.. ఫోటో చూసి ఎమోషనల్ అయిన జయకృష్ణ!

సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున అనారోగ్య సమస్యలతో మరణించారు. ఈ క్రమంలోనే ఆయన కుటుంబ సభ్యులందరూ కృష్ణ గారికి ఘన నివాళి అర్పించారు.ఈ క్రమంలోనే మహేష్ బాబు కుమారుడు గౌతమ్ సైతం విదేశాలలో ఉండటం వల్ల ఆయన కూడా తన తాతయ్య చివరి చూపు కోసం హైదరాబాద్ వచ్చారు. ఇక కృష్ణ గారి పెద్ద కుమారుడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ అమెరికాలో ఉంటున్నారు.పై చదువుల నిమిత్తం అమెరికా వెళ్ళినటువంటి జయకృష్ణ తన తాతయ్య మరణ వార్త తెలుసుకొని హుటాహుటిన ఇండియా బయలుదేరారు.

ఈ క్రమంలోనే ఆయన నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ రావడంతో ఆయన వచ్చేసరికి కృష్ణ గారికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి అయ్యాయి.ఇలా అమెరికా నుంచి తన తాతయ్య చివరి చూపు కోసం వచ్చినప్పటికీ తన తాతయ్యను కడసారి చూసుకోలేకపోవడంతో కృష్ణ ఫోటోకి నివాళులు అర్పిస్తూ జయ కృష్ణ ఎంతో ఎమోషనల్ అయ్యారు. బుధవారం ఫిలిం కల్చర్ క్లబ్ లో కృష్ణ సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు కృష్ణ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

ఈ సంతాప సభ కార్యక్రమానికి హాజరైనటువంటి జయకృష్ణ తన తాతయ్య ఫోటోకి నివాళులు అర్పిస్తూ ఎమోషనల్ అయ్యారు.రమేష్ బాబు కుమారుడిగా జయకృష్ణ అందరికీ సుపరిచితమే అయితే ఈయన పెద్దగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండరు. ప్రస్తుతం తన చదువుల నిమిత్తం ఈయన అమెరికాలో ఉంటున్నారు.ఇక జయకృష్ణ తండ్రి రమేష్ బాబు కూడా అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఒకే ఏడాదిలో మహేష్ బాబు కుటుంబంలో ముగ్గురు మరణించడంతో ఘట్టమనేని ఫ్యామిలీ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.