janvi kapoor: కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్….ఫోటో వైరల్!

janvi kapoor: అందం, అభినయంతో పాటు నటనలోనూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న అలనాటి అందాల తార, దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. ఎప్పుడూ వరుస సినిమాలతో బిజీగా ఉండే జాన్వీ కపూర్ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. జాన్వీ పుట్టినరోజు కావడంతో తెల్లవారుజామునే స్వామి సేవలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తనతో పాటు తన స్నేహితురాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వారిద్దరూ కలిసి మొక్కులు చెల్లించుకున్నట్టు సమాచారం. ఎప్పుడూ మోడ్రన్ లుక్‌లో అలరించే ఈమె, తిరుమలలో అచ్చమైన తెలుగమ్మాయిలా చీరకట్టులో కనిపించి ఆకట్టుకున్నారు.

ఇకపోతే సినిమాలే కాకుండా అప్పుడప్పుడూ ఇతర రాష్ట్రాలకు, దేశ విదేశాలకు వెళుతూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ వస్తోంది జాన్వీ. అందులో ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన శ్రీ వెంకటేశ్వర స్వారు కొలువు దీరిన తిరుమలకు కూడా వీలుకుదిరినప్పుడల్లా వెళ్లి, మొక్కులను సమర్పించడం ఆనవాయితీగా మార్చుకున్నారు. అలా విహారయాత్రలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే జాన్వీ, ఎప్పుటిలాగే ఇప్పుడు కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడంతో అందరి కళ్లు ఒక్కసారిగా ఆమెపై పడ్డాయని చెప్పవచ్చు.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాన్వీ కపూర్… తాను తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్న ఫొటోస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు. ఎప్పుడూ మోడ్రన్‌ డ్రెస్సుల్లో చూసిన అభిమానులు కూడా, ఆమె ఇలా సంప్రదాయబద్దమైన తెలుగమ్మాయిలా కనిపించేసరికి కుర్రకారు చూపు తిప్పుకోలేకపోతున్నారు. అంతే కాకుండా ఆమె కాలి నడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. తన స్నేహితురాళ్లతో కలిసి దిగిన పలు ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇక ఆమె ప్రస్తుతం దోస్తానా, గుడ్‌లక్ జెర్రీ, మిలీ లాంటి సినిమాల్లో నటిస్తూ కెరీర్‌ను బిల్డ్‌ చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం.