తన దగ్గరికి వెళ్లిన కూడా సిగ్గు పడుతాడంటూ ప్రభాస్ గురించి అసలు నిజం బయటపెట్టిన పూజాహెగ్డే!

పూజా హెగ్డే ఒక భారతీయ మోడల్ ఇంకా ఆమె టాలీవుడ్ తో పాటు అన్ని ప్రముఖ భాష సినిమాలలో నటిస్తుంటుంది. పూజ 2010సంవత్సరంలో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది.

దీని తరువాత 2012 సంవత్సరంలో తమిళ సూపర్ హీరో సినిమా అయిన ముగమూడి అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఈమె ఆ తరువాత 2014లో ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తరువాత ఒక లైలా కోసం సినిమాలో నటించడం జరిగింది. ఈ సినిమాలలో ఈమె డీసెంట్ క్యారెక్టర్స్ లో నటించి అందరినీ మెప్పించింది. అయితే ఈ పాత్రలకు గాని ఈ సినిమాలో ఆమె చేసిన నటనకు గాని ఈమెకు పెద్దగా పేరు ప్రఖ్యాతలు రాలేదు. అయితే ఈ సినిమాల తర్వాత వరుసగా ఆమెకు ఆఫర్లు వచ్చాయి కానీ ఈమెకు గుర్తింపు రాలేదు. దువ్వాడ జగన్నాథం సినిమాతో ఆమెకు అభిమానులు విపరీతంగా పెరిగిపోయారు. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు రావడం జరిగింది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈమెకు అవకాశాలు వచ్చాయి. అటు టాలీవుడ్ లో ఇటు బాలీవుడ్ లో రెండు సినీ పరిశ్రమలను ఒకేసారి ఏలేసింది పూజా హెగ్డే.

అయితే రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బీస్ట్, ఆచార్య చిత్రాలు వరుసగా ఆమె ఖాతాలో ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈమెకు ఐరన్ లెగ్ అనే పేరును ఇండస్ట్రీలో ట్యాగ్ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ ఆమెకు ఇటీవల సైమా అవార్డ్స్ లో ఉత్తమ నటిగా అవార్డ్ వచ్చింది.

ఇక గతంలో పూజా హెగ్డే ప్రభాస్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. అయితే రాధే శ్యామ్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో ఆమె పాల్గొంది. అందులో యాంకర్ ఆమెను బాగా సిగ్గుపడి ప్రభాస్ తో పనిచెయ్యడం ఎలా అనిపించింది మీ దగ్గర కూడా సిగ్గు పడ్డాడా? అని అడగ్గా.. నవ్వుతూ తను ప్రభాస్ ఇంటర్వ్యులలో ఇంకా ప్రెస్ మీట్ లలో కొంచెం సిగ్గుపడటం అందరికీ తెలిసిన విషయం. అతని దగ్గరకు వెళ్ళిన అతను సిగ్గుపడతాడని కానీ అతను ముందుగా చాలా సిగ్గు పడేవాడు. ఒక ఐదు రోజుల తర్వాత సెట్లో నార్మల్ గా అయిపోయాడనీ తెలిపింది. మరి ఆమెకు అయితే అలా ఏమీ అనిపించలేదనీ పూజ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఆమె మహేష్ త్రివిక్రమ్ కలిసి చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా దానితో పాటు మరికొన్ని అవకాశాలు కూడా వచ్చినట్టు తెలుపడం జరిగింది.