పెళ్లి కాకపోయినా పర్వాలేదు పిల్లలను కనాలని ఉంది.. షాకింగ్ కామెంట్స్ చేసిన సీతారామం హీరోయిన్!

సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి మృణాల్ ఠాకూర్.ఈమె తెలుగులో నటించిన మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయం అందుకొని ఎంతోమంది తెలుగు అభిమానులను సంపాదించుకున్నారు. ఇలా తెలుగులో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమెకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇక సీతారామం సినిమాలో సీతామహాలక్ష్మి పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె సమాజంలో ఒక అమ్మాయి ఎదుర్కొనే ఇబ్బందుల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఒక సమాజంలో అమ్మాయికి ఎన్నో రకాల ప్రశ్నలు ఎదురవుతుంటాయని తన భవిష్యత్తు, ప్రేమ పెళ్లి పిల్లలు వంటి ప్రశ్నలు తరచూ ఎదురవుతూ ఉంటాయని తెలిపారు. అయితే ప్రతి ఒక్క అమ్మాయి కూడా భవిష్యత్తులో తనకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా తాను చేసే వృత్తిని తన మనసుని అర్థం చేసుకునే అబ్బాయి రావాలని కోరుకుంటారు. తాను కూడా తనని గౌరవించి తన అభిప్రాయాలను ఇష్టపడే వ్యక్తి రావాలని కోరుకుంటాను.

ప్రస్తుత కాలంలో ఇలా ఒకరి అభిప్రాయాలకు ఒకరికి గౌరవం ఇచ్చే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది అందుకే నాకు ఈ ప్రేమ పెళ్లి అంటే ఇష్టం లేదని అయితే పెళ్లి ఇష్టం లేకపోయినా పిల్లలను మాత్రం కనాలని ఉంది అంటూ ఈ సందర్భంగా మృణాల్ ఠాకూర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈమె పెళ్లి పిల్లల గురించి కామెంట్ చేయడంతో పలువురు ఈమె వ్యాఖ్యలపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.