ప్రభాస్ వల్ల అది అయ్యే పనేనా .. షాకవుతున్న ఫ్యాన్స్ ..?

కేజీఎఫ్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 చిత్రీకరణలో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ కంప్లీట్ అయ్యాక టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమా చేయబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వైరల్ వార్తలు అనేకం వచ్చాయి. కానీ కేజీఎఫ్ సీక్వెల్ తరువాత డార్లింగ్ ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తున్నట్లు కన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. ఇప్పటికే నెట్టింట్లో రిలీజ్ అయిన సలార్ పోస్టర్…ఫుల్ వైరల్ అయ్యింది. దీంతో వీరిద్దరి కాంబోపై భారీ అంచనాలే పెరిగాయి. హీరోని ఎలివేట్ చేస్తూ…ఫుల్ లెన్త్ యాక్షన్ సినిమాలను రూపొందించడంలో ప్రశాంత్ నీల్ ధిట్ట అని కేజీఎఫ్ సినిమాతో నిరూపించుకున్నాడు.

How Italian media covered Prabhas and Pooja Hegde's Radhe Shyam shoot.  Viral video - Movies News

ఇప్పుడు ఈయన చేతుల్లో డార్లింగ్ ప్రభాస్ పడటంతో…యంగ్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 షూటింగ్ ని ఇటీవలే కంప్లీట్ చేశాడు. ఇక ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కాగా ఈ మూవీ ఇంకొన్ని రోజుల్లో షూటింగ్ కూడా పూర్తి కానుంది. ఈ మూవీ చేస్తూనే ప్రభాస్…చాలా సినిమాలకు ఓకే చెప్పేశాడు. అందులో ఆదిపురుష్ తో పాటు సలార్ కూడా ఉన్నాయి. అయితే ఆది పురుష్ మూవీ సంబంధించి దర్శకుడు ప్రస్తుతం జీఎఫ్‌ఎక్స్ వర్స్క్ ను స్టార్ట్ చేశాడు. ఇప్పట్లో ప్రభాస్ షూట్ ఉండకపోవచ్చు. దీంతో రాధేశ్యామ్ కంప్లీట్ కాగానే సలార్ షూట్ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు.

प्रभास की फिल्म 'सलार' से बड़ी अपडेट आई सामने? Prabhas all set to complete  Salaar shooting before Adipurush? - Hindi Filmibeat

అయితే ఇప్పుడు ఓ లేటెస్ట్ అప్‌డేట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అది విని ప్రభాస్ ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. అసలు విషయం ఏంటంటే, సలార్ షూటింగ్ ను సంక్రాంతి తరువాత ప్రారంభించి దసరా నాటికి విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోందట. మరో విషయం ఏంటంటే ప్రభాస్ సలార్ మూవీని కేవలం 4 నెలల్లోనే కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారట. ఇది విన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఇది సాధ్యమేనా అని అలోచనలో పడ్డారట. చూడాలి మరి నిజంగా అంత త్వరగా ఈ పాన్ ఇండియన్ స్టార్ సలార్ ని కంప్లీట్ చేస్తాడా లేదా ..!