అరుదైన వ్యాధితో బాధపడుతున్న జాతి రత్నాలు డైరెక్టర్?

జాతి రత్నాలు సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు దర్శకుడు అనుదీప్. ఈయన అద్భుతమైన కామెడీ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ విపరీతమైన ఆదరణ సొంతం చేసుకుంటున్నారు.ఇక ఈయన సినిమాలలో మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎంతో సరదాగా ఉంటారు. ఈయన ఏ ఇంటర్వ్యూలో అయిన పాల్గొంటే ఆ ఇంటర్వ్యూ క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది.ఈ క్రమంలోనే తాజాగా ఈయన దర్శకత్వంలో వచ్చిన ప్రిన్స్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తనకు సోకిన అరుదైన వ్యాధి గురించి వెల్లడించారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అనుదీప్ తాను హైలీ సెన్సిటివ్ పర్సన్ అనే వ్యాధితో బాధపడుతున్నారని వెల్లడించారు.ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయని అయితే కొందరిలో మాత్రమే ఈ వ్యాధి లక్షణాల వల్ల పెద్ద ఎత్తున శరీరంలో మార్పులు చోటు చేసుకుంటాయని ఈయన తెలిపారు. ఈ వ్యాధి లక్షణాలు తనలో ఉన్నాయని అందుకే తాను ఈ వ్యాధి వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు అనుదీప్ వెల్లడించారు. ఈ విధమైనటువంటి వ్యాధితో బాధపడేవారు ఎక్కువగా వెలుతురులో పని చేయలేరని తొందరగా అలసిపోతూ ఉంటారని తెలిపారు.

ఇక ఘాటైన వాసనలను కూడా తాను భరించలేనని అనుదీప్ వెల్లడించారు.ఇక తనకు కాఫీ తాగిన రెండు రోజులపాటు నిద్ర ఉండదని అలాగే ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నా కానీ తన మెదుడు పని తీరు పూర్తిగా తగ్గిపోతుంది అంటూ ఈ సందర్భంగా ఈయన ఈ వ్యాధి లక్షణాలు గురించి తెలియజేస్తూ ఆయన ఏ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో వెల్లడించారు.అయితే ఈ వ్యాధికి ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకొని తాను అలాంటి ఆహార పదార్థాలను మాత్రమే తీసుకుంటున్నానని తెలిపారు. ఇకపోతే భవిష్యత్తులో ఎప్పుడైనా తాను ఈ వ్యాధి గురించి ఒక సినిమా చేసి అందరికీ అవగాహన కల్పిస్తానంటూ అనుదీప్ వెల్లడించారు.