కృష్ణ అస్థికలను కలపడానికి నరేష్ రాకపోవడానికి అదే కారణమా.. అసలు విషయం చెప్పిన జర్నలిస్ట్!

టాలీవుడ్ సూపర్ స్టార్, నటశేఖరుడు కృష్ణ ఈనెల 15వ తేదీ మరణించిన సంగతి తెలిసిందే. ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈయన మరణించడంతో ఘట్టమనేని కుటుంబం తీవ్రశోక సత్రంలో మునిగిపోయింది. ఇలా ఈయన మరణ వార్త మహేష్ బాబును ఎంతగానో కృంగదీసిందని చెప్పాలి. మహేష్ బాబు కృష్ణ వారసుడిగా ఆయన అంత్యక్రియలను పూర్తి చేయడమే కాకుండా ఆయన ఆస్తికలను కూడా పవిత్రమైన కృష్ణానదిలో నిమర్జనం చేశారు.

సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ చేరుకున్నటువంటి మహేష్ బాబు అక్కడ శాస్త్రం ప్రకారం తన తండ్రి అస్థికలను కృష్ణ నదిలో కలిపారు.ఇలా మహేష్ బాబు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో హాజరైనప్పటికీ నటుడు నరేష్ మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.అయితే నరేష్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి గల కారణాలను సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు తెలిపారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ కృష్ణ అసలు వారసుడు మహేష్ బాబు మాత్రమేనని తెలిపారు.

నరేష్ నటి పవిత్ర లోకేష్ తో కలిసి కృష్ణ అంత్యక్రియల సమయంలో వ్యవహరించిన తీరు మహేష్ బాబు కుటుంబ సభ్యులకు నచ్చలేదు. ఇలా సొంత కుటుంబ సభ్యులు మాదిరిగా పవిత్ర లోకేష్ అన్ని కార్యక్రమాలలో ముందుకు రావడంతో మహేష్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారని అందుకే నరేష్ అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయారని ఈయన వెల్లడించారు. ఇక కృష్ణ అస్థికలను కలపడం కోసం నరేష్ హాజరు కాకపోవడానికి కారణం కూడా ఆ గొడవేనని తెలుస్తుంది. ఇక మహేష్ బాబు కృష్ణ అసలైన వారసుడు కావడంతో ఆయన కృష్ణ కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు.