కింగ్ నాగార్జున మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి అదే కారణమా.. అందుకే విడిపోయారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కుటుంబాలలో దగ్గుబాటి కుటుంబం అక్కినేని కుటుంబం ఒకటి అని చెప్పాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ రెండు కుటుంబాలు కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇక అక్కినేని కుటుంబంలో నాగార్జున ఆయన కుమారులు వారసులుగా కొనసాగుతూ ఉండగా దగ్గుబాటి కుటుంబంలో సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరించగా వెంకటేష్,రానా హీరోలుగా కొనసాగుతున్నారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉన్న సంగతి తెలిసిందే.

అక్కినేని నాగేశ్వరరావు ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న సమయంలో రామానాయుడు గారితో ఎంతో మంచి పరిచయం ఏర్పడింది. ఇలా ఈ రెండు కుటుంబాల మధ్య మంచి అవినాభావ సంబంధం ఉండటం వల్ల రామానాయుడు కుమార్తె లక్ష్మిని నాగేశ్వరరావు కుమార్తె నాగార్జునకి ఇచ్చి వివాహం చేశారు.అయితే వీరి వైవాహిక జీవితం కొన్ని సంవత్సరాలు మాత్రమే సాఫీగా కొనసాగిందని, అనంతరం వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడం నాగార్జున నటి అమలను పెళ్లి చేసుకోవడం జరిగింది.

ఈ విధంగా నాగర్జున అమలను పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…లక్ష్మి అమెరికాలో పెరగటం వల్ల ఆమె ఇండియాలో అడ్జస్ట్ కాలేకపోవడమే కారణమని సమాచారం.అమెరికాలో పెరిగినటువంటి లక్ష్మిని రామానాయుడు ఇండియాకి రప్పించి ఉన్నఫలంగా చెన్నైలో వీరి వివాహం జరిపించారు. ఇక వీరిద్దరికీ నాగచైతన్య జన్మించిన తర్వాత ఈమె ఇండియాలో ఉండలేక నాగార్జునతో కలిసి అమెరికాలో స్థిరపడాలని కోరుకున్నారట. కానీ నాగార్జున సినిమాలతో బిజీగా ఉండటం వల్ల తాను అమెరికా రాలేరని తేల్చి చెప్పాడు. ఇలా ఈ విషయంలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం వల్లే విడాకులు తీసుకొని విడిపోయారని తెలుస్తోంది.