సినిమాలొద్దు, ఓటీటీలే ముద్దు.. అంటోన్న రెజీనా కసండ్రా.!

‘ఎస్‌ఎమ్ఎస్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ రెజీనా కసండ్రా. ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ తదితర సినిమాలతో హిట్లు కొట్టింది. మరీ స్టార్ హీరోయిన్ అనలేం కానీ, ఓ మోస్తరు స్టార్‌డమ్‌తో నెట్టుకొచ్చేసింది. అయితే, ఈ మధ్య రెజీనా కసండ్రాకి ఏమంత గొప్ప అవకాశాలు రావడం లేదనే చెప్పాలి సినిమాల్లో.

చివరిగా ‘ఆచార్య’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి మెప్పించింది. ఆ తర్వాత ఓటీటీలో ప్రత్యక్షమైంది. వరుసగా రెండు, మూడు వెబ్ సిరీస్‌లు చేసేసింది.

వెబ్ సిరీస్‌లలో రెజీనా కసండ్రా పర్‌ఫామెన్స్ చూసి ఆడియన్స్ అవాక్కయ్యారు. అవును నిజమే, ఆయా ఓటీటీ కంటెంట్లు రెజీనాలోని అసలు సిసలు నటిని బయటికి తీసుకొచ్చాయ్.

దాంతో, ఇకపై సినిమాలొద్దు, ఓటీటీలే ముద్దు అంటోందట రెజీనా. ఓటీటీలో రెమ్యునరేషన్ కూడా బాగానే ముడుతుండడంతో, ఓటీటీ నటిగానే ఫిక్సయిపోవాలనుకుంటోందట రెజీనా కసండ్రా. అదీ సంగతి.