హీరో తో చేసే సినిమాకంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాకే నయనతార ఎక్కువ డిమాండ్ చేస్తుందా ..?

నయనతార ప్రస్తుతం తెలుగు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. సీనియర్ స్టార్ హీరోలకి అన్ని విధాల నయన్ ఇప్పుడు బెస్ట్ ఛాయిస్ అంటున్నారు. గత ఏడాది మెగాస్టార్ తో సైరా నరసింహా రెడ్డి సినిమా చేసి హిట్ అందుకుంది. అలాగే ఈ ఏడాది కోలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ సినిమాలో నటించింది. అయితే కమర్షియల్ సినిమాలకి స్టార్ హీరోలతో కలిసి నటించే సినిమాకి నయనతార రెమ్యూనరేషన్ 2 కోట్ల కి పైగానే అందుకుంటుందని అంటున్నారు. ప్రేక్షకుల్లో నయనతారకి ఉన్న క్రేజ్ వల్లే నిర్మాతలు అంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారన్న టాక్ ఉంది.

AR Murugadoss shares an unseen poster of Rajinikanth and Nayanthara from  Darbar | PINKVILLA

నయనతార కమిటయిన సినిమా మాత్రమే చేస్తుంది. ఆ సినిమాలో ఎంతటి స్టార్ హీరో ఉన్నప్పటికి ప్రమోషన్స్ కి మాత్రం రాదు. అయినా మేకర్స్ నయనతార అంటే డేట్స్ కోసం ఎన్నిరోజులైనా వేయిట్ చేస్తుంటారు. కాగా నయనతార ప్రస్తుతం తమిళంలో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుంది. ‘మూకుత్తి అమ్మన్’ అన్న టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కింది. తెలుగులో ఈ సినిమాను అమ్మోరు తల్లి పేరుతో విడుదల చేయబోతున్నారు.

Mookuthi Amman' to have digital release and a television premiere this  Diwali?

కాగా ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందన్న విమర్శలు ఎదుర్కొంటుంది నయతార. అమ్మోరు పాత్రలో నయన్ నటించడం వల్ల కొందరు తప్పుబడుతున్నారట. అయితే ఇలాంటి పాత్రలు చేసినప్పుడు వివాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న సంగతి తెలిసే ఈ సినిమా చేసేందుకు నయనతార ఒప్పుకుందని అంటున్నారు. అంతేకాదు భారీ కమర్షియల్ సినిమాకి కూడా ఇవ్వని విధంగా ఈ సినిమాకి దాదాపు 4 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవమో తెలీదు గాని మొదటిసారి అమ్మవారి పాత్రలో నటించినందుకు నయనతార చాలా ఎగ్జైటింగ్ గా ఫీలవుతుందట.