‘మల్లీశ్వరి’ కత్రినా.. మళ్ళీ వస్తోందిట.!

కత్రినా కైఫ్‌ని ఎలా మర్చిపోగలరు తెలుగు ప్రేక్షకులు.? తెలుగులో చేసిందే రెండు సినిమాలు. కానీ, అందులో ఒకటి అప్పట్లో సంచలనం.! సూపర్ డూపర్ హిట్ అని కాదు.. ఆ సినిమా ప్రేక్షకుల మీద క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది.

సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ సంగతి పక్కన పెడితే, నటిగా కత్రినాకి మైనస్ మార్కులు పడ్డాయి. కాలక్రమంలో అదే ఆమెకు ప్లస్ అయిపోయింది. అదంతా గతం. తనలోని మైనస్సుల్ని కత్రినా క్రమంగా సరిదిద్దుకుంది.

బాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. వెలుగుతూనే వుంది.. స్టార్ హీరోయిన్‌గా.! అసలు విషయమేంటంటే, ఆ కత్రినాని మళ్ళీ తెలుగులోకి తీసుకొస్తున్నారట. అదీ, ఓ సీనియర్ హీరో కోసం.

అయితే, కత్రినా చెబుతున్న రెమ్యునరేషన్‌కి ఒకింత భయపడి, వేరే ఆలోచనలూ చేస్తున్నారట. సదరు హీరో మాత్రం, కత్రినా అయితే ఆ ప్రాజెక్టుకి క్రేజ్ మరింత పెరుగుతుందనే ఆలోచనతో వున్నాడట. ఏమో, ఏం జరుగుతుందో మరి.! కత్రినా వస్తే మాత్రం, పాన్ ఇండియా రేంజ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది.