శోభన్ బాబు బ్రతికున్న సమయంలోనే చనిపోయానని చెప్పుకున్నారా.. షాకింగ్ వాస్తవాలివే!

శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు కాగా శోభన్ బాబు నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఉదాత్తమైన వ్యక్తిత్వం ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోలలో శోభన్ బాబు ఒకరు కావడం గమనార్హం. ప్రేమ కథలలో ఎక్కువగా నటించిన శోభన్ బాబు ఆ సినిమాల ద్వారా ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

రైతు కుటుంబంలో జన్మించిన శోభన్ బాబు చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తిని కలిగి ఉన్నారు. మల్లీశ్వరి సినిమాను 22సార్లు చూశానని శోభన్ బాబు ఒక సందర్భంలో వెల్లడించారు. మద్రాస్ లో లా కోర్స్ లో చేరిన సమయంలో సినిమాలలో ఆఫర్ల కోసం శోభన్ బాబు ప్రయత్నాలను మొదలుపెట్టారు. దైవబలం సినిమాతో శోభన్ బాబు కెరీర్ ను మొదలుపెట్టగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

ఆ తర్వాత వరుసగా సినిమా ఆఫర్లను అందుకున్న శోభన్ బాబు స్టార్ హీరో స్టేటస్ ను అందుకున్నారు. సోగ్గాడిగా పాపులర్ అయిన శోభన్ బాబు తనను అందంగా చూసిన ప్రేక్షకులు మారిన లుక్ తో చూడలేరని తర్వాత రోజుల్లో చాలా సినిమాలలో ఆఫర్లు వచ్చినా శోభన్ బాబు ఆ ఆఫర్లను వదులుకున్నారు. సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ కు వచ్చిన తర్వాత కూడా శోభన్ బాబు కొంతకాలం మద్రాస్ లో ఉన్నారు.

ప్రముఖ దర్శకుడు కోదండ రామిరెడ్డి శోభన్ బాబును సినిమాలు చేయాలని కోరగా ఆ అందాల నటుడు శోభన్ బాబు ఎప్పుడో చనిపోయాడని ఆయన చెప్పారని సమాచారం. జుట్టు సరిగ్గా లేకుండా ముడతలతో ఉన్న శరీరంతో తాను తెరపై కనిపించనని ఆయన చెప్పినట్టు సమాచారం. ఫ్యాన్స్ ను కూడా తనను చూడటానికి రావద్దని చెప్పానని శోభన్ బాబు కోదండ రామిరెడ్డితో వెల్లడించారని తెలుస్తోంది.