Rashmika Mandanna: రెండు కోట్లు ఇస్తే ఐటమ్ సాంగుకు సై అంటున్న శ్రీవల్లి..?

Rashmika Mandanna: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క సినిమాలో ఐటమ్ సాంగ్ ఉండటం సర్వసాధారణం అయిపోయింది.అయితే ఒకప్పుడు ఈ ఐటెం సాంగ్ చేయడానికి కొంతమంది నటీమణులు ఉండేవారు కానీ ప్రస్తుతం ఐటమ్ సాంగ్ చేయడానికి కూడా స్టార్ హీరోయిన్స్ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు సైతం ఐటమ్ సాంగ్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇప్పటికే తమన్నా, కాజల్, పూజా హెగ్డే, శృతిహాసన్, సమంత వంటి స్టార్ సెలబ్రిటీలు పలు ఐటమ్ సాంగ్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ జాబితాలోకి మరో ముద్దుగుమ్మ చేరబోతోంది. అర్జున్ రెడ్డి సినిమాని బాలీవుడ్ ఇండస్ట్రీలో కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ సందీప్ వంగా ప్రస్తుతం రణబీర్ కపూర్ తో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ‘యానిమల్’ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఇందులో రణబీర్ కపూర్ సరసన పరిణీతి చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో చేయడం కోసం దర్శకుడు హీరోయిన్ రష్మికను సంప్రదించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక ఒక్కో సినిమాకు మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడం కోసం ముద్దుగుమ్మ ఏకంగా రెండు కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. రెండు కోట్ల రూపాయల పారితోషికం ఇస్తే ఐటమ్ సాంగ్లో చేయడానికి శ్రీవల్లి సిద్ధంగా ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పుష్ప సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక ఇలా స్పెషల్ సాంగ్ లో కూడా దుమ్ము రేపితే ఈ కన్నడ ముద్దుగుమ్మ క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుందని చెప్పవచ్చు.