సమంత కావాలి అంటే హిట్ కొట్టాల్సిందే !

సమంత కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మజిలీ, ఓబేబీ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న సమంత ఆ తర్వాత జాను సినిమా చేసింది. కాని ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. దాంతో మళ్ళీ చాలా నెలలు కొత్త ప్రాజెక్ట్ ని కమిటవలేదు. దీనికి కరోనా కూడా తోడయింది. అయితే సమంత లాంటి బ్యూటి ఫుల్ హీరోయిన్ .. తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేయాల్సిన తన నుంచి కొత్త ప్రాజెక్ట్స్ కి సంబంధించిన అనౌన్స్ మెంట్ రాకపోవడంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.

కాని ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 లో నటిస్తుందన్న చిన్న తృప్తి మాత్రం ఉండేది. అయితే అనూహ్యంగా సమంత నుంచి క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చి స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ శాకుంతలం సినిమాలో సమంత మేయిన్ లీడ్ రోల్ లో నటిస్తోంది. గుణశేఖర్ శాకుంతలంగా సమంత ని ప్రకటించగానే అభిమానులు.. ఇండస్ట్రీ వర్గాలలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంత పెద్ద క్రేజీ ప్రాజెక్ట్ లో సమంత నటిస్తున్నందుకు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే సమంత లాంటి స్టార్ హీరోయిన్ ని డైరెక్ట్ చేయడానికి.. తనతో సినిమా చేయడానికి చిన్న నుంచి పెద్ద డైరెక్టర్స్ వరకు అందరూ ఆతృతగా ఉంటారు. ఆ లిస్ట్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఉన్నాడు. అ..! సినిమాతో ఇండస్ట్రీలో దర్శకుడిగా గుర్తింపు పొందిన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం తేజ సజ్జా హీరోగా ‘జాంబీ రెడ్డి’ సినిమా రూపొందిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ దర్శకుడు సమంత తో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. అది ‘అ!’ సినిమాకి సీక్వెల్ స్క్రిప్ట్ అని సమాచారం. అయితే ‘జాంబీ రెడ్డి’ కథా నేపథ్యంలోనే ‘అ!’ సీక్వెల్ సాగుతుందని సమాచారం. అందుకే ‘జాంబీ రెడ్డి’ హిట్ అయితే సమంత డేట్స్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.