Mega Brothers: మెగా బ్రదర్స్ ముగ్గురితోనూ పని చేశా.. వ్యక్తిగతంగా వాళ్లు ఎలా ఉంటారు బయటపెట్టిన సీనియర్ యాక్టర్!

Mega Brothers: తన అభిమాన హీరో ఒకప్పుడు కృష్ణ గారు అని, ఆ తర్వాత చిరంజీవి గారు అని నటుడు పసునూరి శ్రీనివాసులు అన్నారు. తాను చిన్నతనంలో కృష్ణ గారి ఫైట్ చూసి ఇష్టపడే వాడినని, ఆ తర్వాత డాన్స్ విషయానికొస్తే ఇప్పుడు కూడా చిరంజీవి గారు చాలా చక్కగా చేస్తారని ఆయన తెలిపారు. ఇకపోతే తాను మొట్టమొదటి సారిగా, లైవ్‌గా చూసిన యాక్షన్‌ మూవీ ఏంటంటే అది కోతల రాయుడు అని, అందులో చిరంజీవి గారు నటించారని శ్రీనివాసులు అన్నారు. ఈ విషయం తాను ఏ ఇంటర్వ్యూలోనూ చెప్పలేదని ఇటీవల నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఆ తర్వాత బాలకృష్ణ గారి మూవీ షూటింగ్ చూశానని ఆయన చెప్పుకొచ్చారు. అలాంటిది ఇప్పుడు చిరంజీవితోనే కలిసి నటిస్తున్నానని ఆయన గర్వంగా చెప్పుకున్నారు.

జై చిరంజీవ సినిమాలోనూ తాను, చిరంజీవి గారితో కలిసి నటించానన్న శ్రీనివాసులు, ప్రస్తుతం నటిస్తున్న ఓ సినిమాలోనూ ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నానని ఆయన తెలిపారు. తామిద్దరూ ఓకే ఒకే ఫ్రేమ్ లో ఉంటామని ఆయన స్పష్టం చేశారు. తనని చిరంజీవి గారు పిలిచి కూడా మాట్లాడారని, ఆయనతో అంత చనువు కూడా ఉందని, తాను చనువు తీసుకుంటాను కూడా అని శ్రీనివాసులు చెప్పారు. ఎందుకంటే ఆయన కోసం తాను పని చేస్తానని, అందరితోనూ ఆయన మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తారని ఆయన చెప్పారు.

తాను చిరంజీవి గారితోనే కాదు, పవన్ కళ్యాణ్, నాగ బాబుతో… వాళ్ల ముగ్గురితోనూ కలిసి చేశానని శ్రీనివాసులు అన్నారు. అందుకు తాను చాలా అదృష్టవంతుడినని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వాళ్ల వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే అది ఒక్క మాటలో చెప్పేది కాదని, మనకు వాళ్లకు ఎంత రాపో ఉంటుందో, వాళ్ళు కూడా మనతో అలానే ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఇటీవలే సత్యదేవ్ దేవ్ తో గాడ్ సే సినిమాలో నటించానన్న ఆయన.. కేజీఎఫ్ 2 లోనూ చేస్తున్నానని శ్రీనివాసులు తెలిపారు.