Raj Tharun: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న నటుల మాదిరిగానే తనకంటూ ఓ స్టైల్ని క్రియేట్ చేసుకున్న నటుుడు రాజ్ తరుణ్. సినిమాల్లోకి రాకముందు లఘు చిత్రాల్లో నటించిన ఆయన ఉయ్యాల జంపాల సినిమాతో కథా నాయకుడిగా పరిచయం అయ్యాడు. అది అనుకున్న దానికంటే బాగానే హిట్ కొట్టడంలో అనంతరం సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్ లాంటి సినిమాల్లో నటించి తన కామెడీతో ప్రేక్షకులను అలరించారు.
మా ఎన్నికల్లో ఓటేసిన వెళ్లిపోయిన తర్వాత మంచు విష్ణు, నటుడు రాజ్ తరుణ్ను పిలిచి సాయంత్రం కలుద్దాం అని చెప్పిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ మారింది. దానిపై ఆయనే స్వయంగా స్పందించి, అదేం లేదు తర్వాత కలుద్దామని మామూలుగా అలా చెప్పినట్టు ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు అయిపోయాక ఫోన్ చేసి విష్ చేశాను. కానీ కలవడం కుదరలేదని ఆయన చెప్పారు. అందరికీ తెలుసో లేదో గానీ విష్ణు అసలు స్మోకింగ్ గానీ, డ్రింకింగ్ గానీ చేయరని ఆయన అన్నారు. కాకపోతే వాళ్లింట్లో భోజనం చాలా బాగుంటుందని, తినడానికి మాత్రం అప్పుడప్పుడూ వెళుతూ ఉంటానని ఆయన చెప్పారు. నిజంగా విష్ణు చాలా గ్రేట్ హోస్ట్ అని ఆయన అన్నారు.
ఇకపోతే విష్ణు తనకు ఓ పెద్దన్న లాంటివాడన్న రాజ్ తరుణ్, ప్రకాష్ రాజ్ కూడా తనతో బాగా మాట్లాడతారని ఆయన అన్నారు. వాళ్లిద్దర్లో ఎవరు గెలిచినా సరే ఫైనల్గా మాత్రం అసోసియేషన్ బాగుండాలని తాను అనుకున్నట్టు రాజ్ తరుణ్ చెప్పారు.