Ram Gopal Varma: ఈ మధ్య కాస్త మార్చిన మన కాంట్రవర్శియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మని చూస్తుంటే ఆయన చేసే ప్రతీ పనీ వెరైటీగానే కనిపిస్తోంది. ఇంతకుముందులా కాంట్రవర్శియల్ కామెంట్స్ చేయడం, వివాదాలకు పోవడం లాంటివి చాలావరకు తగ్గించుకున్నట్టే తెలుస్తోంది. అప్పట్లో సినిమా టికెట్ ధరల విషయంలోనూ వివాదాస్పద ట్వీట్లు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచిన రామ్ గోపాల్ వర్మ, ఆ తర్వాత అదే మూవీ టికెట్ల రేట్లపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించిన విషయం అందరికీ తెలిసిందే.
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు, సినిమాలు చేస్తూ వైరల్గా మారే ఈ సంచలన్న దర్శకుడు ఇప్పుడు తాజాగా కాశ్మీర్ ఫైల్స్ మూవీ ప్రమోషన్స్ చేస్తున్నట్టు తెగ ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం ఆయన ఇటీవల చేసిన పోస్టులే కారణం. ఆ సినిమాపై తన స్ట్లైల్లో రివ్యూ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ, ఈ చిత్రం చాలా డేంజరస్గా ఉందని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. దాంతో పాటు డేంజరస్ క్లిప్స్ను కూడా పోస్ట్ చేస్తూ ఈ మధ్య కాలంలో సెన్సేషన్గా మారిన ఆ సినిమాకు ప్రచారం కల్పిస్తున్నట్టు టాక్.
అయితే తాజాగా ఆయన మొక్కలు నాటిన ఓ ఫొటోను షేర్ చేస్తూ , ఈ ఫొటోలు మొక్కలు నాటుతూ కనిపించేది తాను కాదని, ఇలాంటి మంచి పనులు అసలు తనకు గిట్టవు, తాను చేయను, కాబట్టిన ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని తాను కాదు అంటూ ఆయన ట్వీట్ చేయడం అందర్నీ ఆకర్షిస్తోంది. ఆయన ఎలా చెప్పినా, ఏం చెప్పినా ఈ విషయంలో మాత్రం సమాజ హితం కోసం వర్మ ఓ మంచి పని చేశాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మపై ఎవరు ఎన్ని రకాలు కామెంట్ చేసినా, ఎంత తిట్టినా గానీ ఆయన మాత్రం ఎలాంటి బెదిరింపులకు లొంగక, తనకు నచ్చిన దారిలోనే వెళతాడని చాలా మందికి ఇప్పటికే అర్థమైంది. ఏదేమైనా ఇటీవలి కాలంలో ఆయనలో వస్తున్న మార్పులను చూసి, వయసు పైబడడం వల్ల జ్ఞానోదయం అవుతుందోనేమోనని మరికొందరు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి.. నెక్స్ట్ ఏం చేస్తాడో.. !
