Pooja Hedge: నెంబర్ వన్, టూ స్థానాలపై ఏ మాత్రం ఆసక్తి లేదు: పూజా హెగ్డే

Pooja Hedge: పాన్ ఇండియా స్టార్స్‌గా పేరొందిన ప్రభాస్‌, పూజా హగ్డే జంటగా తెరకెక్కిన సినిమా ‘రాధేశ్యామ్‌’. ప్రస్తుతం యావత్‌ భారత సినిమా ఇండస్ట్రీ దృష్టిఈ సినిమాపై పడింది. కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైన విషయం అందరికీ తెలిసిందే. ఇక రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, సాంగ్స్, మేకింగ్ వీడియో రిలీజ్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే పెట్టుకున్నట్టే తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే చిత్ర యూనిట్‌ కూడా సినిమా ప్రమోషన్స్‌ను చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్‌, పూజా హెగ్దే కూడా బిజీ బిజీగా గడుపుతున్నారు.

గత కొన్నిరోజులుగా బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌ వరకు ప్రభాస్‌, పూజా హెగ్డేలు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ… రాధే శ్యామ్ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెగ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుట్టబొమ్మ పూజా హెగ్దే పలు విషయాలను సరదాగా పంచుకున్నారు. తనకు నెంబర్ వన్, నెంబర్ టూ స్థానాలపై ఏ మాత్రం ఆసక్తి లేదని ఆమె స్పష్టం చేశారు. అవి కేవలం మనం నటించే చిత్రాల జయాపజయాలపై మాత్రమే ఆధారపడి ఉంటాయని ఆమె అన్నారు.

తాను ఇప్పటివరకూ ఎంపిక చేసుకున్న చిత్రాలన్నీ కూడా ప్రేక్షకులను అలరించాలన్న కోణంలోనే ఆలోచించి చేశానని పూజా తెలిపారు. తెలుగులో అల్లు అర్జున్‌తో చేసిన బుట్టబొమ్మ పాటకు వేసిన డ్యాన్స్‌ను చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఆదరించారని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. అలా ప్రతీ మూవీలోనూ అలా ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా వారిని ఆకర్షించేలా డ్యాన్స్ స్టెప్స్ చేసేందుకు తాను ఎప్పుడూ ముందుంటానని ఆమె చెప్పారు. తాజాగా విజయ్‌తో బీస్ట్‌ అనే చిత్రంలో చేస్తున్నానన్న ఆమె, అరబిక్ కుత్తు పాటకు వేసిన డ్యాన్స్‌ను కూడా అదే స్థాయిలో ఇష్టపడతారని ఆశిస్తున్నట్టు పూజా ఆశాభావం వ్యక్తం చేశారు.