Surekha సినీ నటి సురేఖా వాణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. తన కూతురితో కలిసి పలు లొకేషన్లలో ఎంజాయ్ చేస్తూ హాట్ పిక్స్ను తన ఇన్స్టా అకౌంట్లో పోస్ట్ చేయడం చూస్తూనే ఉంటాం. అలా పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని ఎక్స్పోజ్ చేసే సురేఖా వాణి, ఆ రకమైన పోస్ట్లపై వచ్చే కామెంట్స్ను ఏ మాత్రం లెక్కచేయకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఈ విషయంపై ఆమె కూతురు సుప్రీత ఓ సారి స్పందించి, వ్యూయర్స్కి వార్నింగ్ కూడా ఇచ్చింది.
ఇకపోతే ప్రముఖ యూట్యూబ్ స్టార్, నటి గాయత్రి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే హోలీ సెలబ్రేషన్స్లో భాగంగా స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన ఆమె, కొన్ని క్షణాల్లోనే విగతజీవిగా మారడంతో ఆమె సన్నిహితులు, సహానటినటులు ఆ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మరణవార్త తెలిసిన పలువురు సెలబ్రెటీలు విచారం వ్యక్తం చేశారు. అందులో ముఖ్యంగా యూట్యూబర్, బిగ్బాస్ ఫేం షణ్ముక్ జస్వంత్, శ్రీహాన్లు సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక అదే విషయంపై నటి సురేఖ వాణి సైతం గాయత్రీ మరణం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గాయత్రితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ నేపథ్యంలో సురేఖ తన ఇన్స్టాగ్రామ్లో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు అందర్నీ కంటతడి పెట్టిస్తుంది. ‘ఈ అమ్మని విడిచి వెళ్లాలని ఎలా అనిపించింది. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ప్లీజ్ తిరిగి రా గాయత్రి. మనం మంచి పార్టీ చేసుకుందాం. నీతో ఇంకా ఎన్నో షేర్ చేసుకోవాలి. ఇద్దరం కలిసి ఇంకా ఎన్నో ఎన్నో జ్ఞాపకాలను పోగు చేసుకోవాలి. తిరిగి రా తల్లి..! ఇంత త్వరగా మమ్మల్ని వదిలి వెళ్లలేవు. ఇది సరైన సయమం కాదు. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. మిస్ యూ.. డాలీ’ అంటూ తాజాగా సురేఖ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. ఈ పోస్ట్ చూసిన ఫాలోవర్స్ గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
