అయిన వాళ్ళే నన్ను మోసం చేసారు అంటూ ఎమోషనల్ అయిన హీరోయిన్ సంజన..?

sanjana galrani

ప్రభాస్ హీరోగా నటించిన బుజ్జిగాడు సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంజన గల్రాని గురించి తెలియని వారంటూ ఉండరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించిన సంజన తమిళ్, తెలుగు భాషలలో ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఇక బుజ్జిగాడు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయింది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సంజన టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంది. ఇలా హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన సంజన కొంతకాలం క్రితం వివాహం చేసుకొని సినిమాలకు పూర్తిగా దూరం అయింది.

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సంజన తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.సినిమాలలో హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో నటించిన మోడల్ గా కూడా మంచి గుర్తింపు పొందిన సంజన ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ఎవరి సహాయం లేకుండానే హీరోయిన్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్నానని అయితే కొంతమంది కావాలనే తన గురించి తప్పుడు ప్రచారం చేస్తూ తనని చెడ్డదానిలా చిత్రీకరించారని తన బాధ వెల్లడించింది. అయితే తనకి బాగా అయిన వ్యక్తులే ఇలా తన గురించి తప్పుడు ప్రచారం చేశారని అందువల్లే తనకు మనుషుల మీద నమ్మకం లేదని చెప్పుకొచ్చింది.

ఇలా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాక ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని.. అయితే మనం నమ్మిన వారే దానికి కారణమైతే మరింత బాధగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇలా స్నేహంగా ఉంటూనే నమ్మించి గొంతు కోశారు అంటూ చాలా ఎమోషనల్ అయింది. అప్పటినుండి మనుషులను నమ్మటం వదిలేసి దేవుడి మీదే భారం వేశానని చెప్పుకొచ్చింది. ఇలా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి వివరిస్తూ చాలా ఎమోషనల్ అయ్యింది. ఇదిలా ఉండగా వివాహం తర్వాత సినిమాలకు దూరమైన సంజన ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. సినిమాలకు దూరమైన కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.