ఆ విషయంలో సౌత్ స్టార్ హీరోయిన్లను సైతం వెనక్కి నెట్టిన సాయి పల్లవి…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సాయి పల్లవి కూడా ఒకరు. తన అందం, అభినయంతో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా పాపులర్ అయ్యింది. తెలుగు,తమిళ్, మలయాళం వంటి పలు భాషలో స్టార్ హీరోల సరసన నటించింది. ఫిదా సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు ఆ సినిమా మంచి హిట్ అవ్వటంతో అప్పటినుండి వెనక్కితిరిగి చూసుకోలేదు. ఈమె నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.ఇటీవల సాయి పల్లవి నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

సాయి పల్లవి ఎక్కువగా తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలలో నటిస్తోంది. తన నటనకు ఇప్పటికే ఆమెకి చాల అవార్డులు దక్కాయి. ఇటీవల సాయి పల్లవి శ్యామ్ సింగ రాయ్ సినిమాలో తన నటనకు బిహైండ్ వుడ్స్ అవార్డుల వేడుకలో గోల్డ్ మెడల్ సాధించింది. సాయి పల్లవి ఇలా బంగారు పథకం అందుకోవటం ఇది మొదటి సారి కాదు. ఇప్పటికే మలయాళంలో నటించిన అథిరన్ సినిమాకు సాయి పల్లవి గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకుంది. అథిరన్ సినిమాలో సాయి పల్లవి అద్బుతమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇటీవల శ్యామ్ సింగ రాయ్ సినిమాలో దేవదాసి పాత్రలో నటించి ప్రశంశలు అందుకుంది. ఈ సినిమాలో తన నటనకి గోల్డ్ మెడల్ దక్కింది. సాయి పల్లవి ఇలా మూడుసార్లు గోల్డ్ మెడల్ సాధించింది. ఇలా అతి తక్కువ కాలంలోనే వరుసగా మూడుసార్లు గోల్డ్ మెడల్ సాధించిన ఘనత ఒక్క సాయి పల్లవికి మాత్రమే దక్కింది. ఈ విషయంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లను సైతం సాయి పల్లవి వెనక్కి నెట్టింది. ప్రస్తుతం సాయి పల్లవి గోల్డ్ మెడల్ అందుకున్న ఫోటోలు సోషియల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.