కృతిసనన్‌ : పదేళ్ల సినీ ప్రయాణం!

బాలీవుడ్‌లో తన తొలి సినిమా విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా నటి కృతి సనన్‌ సోషల్‌ విూడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. బాలీవుడ్‌ చిత్రంతో ‘హీరో పంటీ’తో కృతీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బీటౌన్‌లో వరుస సినిమాలు చేస్తున్నారు. తన పదేళ్ల కెరీర్‌ను గుర్తు చేసుకుంటూ పోస్ట్‌ పెట్టారు. హిందీ పరిశ్రమకు వచ్చి 10 ఏళ్లు గడిచాయంటే నమ్మలేకపోతున్నా. నిన్ననే మొదటిసారి సెట్‌లోకి అడుగుపెట్టానేమో అనిపిస్తుంది.

ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. మంచి స్నేహితులను, మరిచిపోలేని జ్ఞాపకాలు సొంతం చేసుకున్నా. నా ప్రయాణంలో భాగమై నన్ను ఆదరించిన అందరికీ, నన్ను నమ్మి ప్రోత్సహించిన దర్శకనిర్మాతలకు ఫ్యాన్స్‌ కు కృతజ్ఞతలు. పెద్ద కలలు కనాలి. వాటిని నిజం చేసుకునేందుకు కృషి చేయాలి. నేనూ అదే చేశాను. నా ప్రయాణంలో మరెన్నో అద్భుతాలు చూడాలనుకుంటున్నా అని రాశారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పాత్రల గురించి కృతి మాట్లాడుతూ సవాల్‌తో కూడిన పాత్రలంటే తనకు ఇష్టమని అన్నారు. రోజూ కొత్తగా ప్రయత్నించే అవకాశమున్న ఇండస్ట్రీలో ఉన్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని.. ఇక్కడికి రావాలి, కలలు కనేవారికి స్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కృతి ‘దో పత్తీ’తో బిజీగా ఉన్నారు.’బ్లూ బటర్‌ ఫ్లై ఫిలిమ్స్‌’ పతాకంపై ఆమె నిర్మించనున్న తొలి చిత్రమిది.