రామ మందిరానికి హీరో యష్ 50 కోట్ల విరాళం… అసలు ఏం జరిగిందంటే?

కేజిఎఫ్ సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు యశ్.ఈయన కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా కొనసాగుతున్న సమయంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇకపోతే కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్ గా కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.ఈ విధంగా కే జి ఎఫ్ సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో యష్ పలు దైవ దర్శనాలను సందర్శిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోని ఈయన గత కొద్ది రోజుల క్రితం అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే కొందరు ఈయన గతంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకున్న కన్నడ నటుడు హీరో స్వామివారి ఆలయ నిర్మాణానికి ఏకంగా 50 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు అంటూ పెద్ద ఎత్తున ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇలా తిరుమలలో దర్శించుకున్న ఫోటోని షేర్ చేస్తూ స్వామి వారి ఆలయ నిర్మాణం కోసం 50 కోట్లు ఇస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

ఇలా తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని కొట్టిపారేశారు. అయితే ఇప్పటికే తన సమస్థ యశోదమార్గ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. సరస్సులు పునరుద్ధరణ భూగర్భ జలాల పెంపుదల కోసం ఈయన కోట్లలో ఖర్చు చేస్తున్నారు. అలాగే ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారికి ఆర్థికంగా ఆదుకుంటున్నారు.ఇలా ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నటువంటి యశ్ గురించి ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు.అయితే ఈయన రామ మందిరాన్ని దర్శించుకున్నప్పటికీ విరాళం ఇస్తానని ఎక్కడ ప్రకటించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.