Prashanth : రెండో పెళ్లి చేసుకోబోతున్న హీరో ప్రశాంత్..! అమ్మాయి ఎవరో?

Prashanth : తమిళ, తెలుగులో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రశాంత్. తెలుగులో జీన్స్, జోడి, దొంగ దొంగ సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. చాలా రోజులు తెలుగు లో కనిపించలేదు. ఇటీవలే రామ్ చరణ్, బోయపాటి శ్రీను దర్శకత్వం లో వచ్చిన వినయ విధేయ రామ లో చరణ్ కు అన్న పాత్రలో నటించారు.

మరొక రీమేక్ సినిమాలో అంధాధున్ లో నటిస్తున్నారు.ఇకపోతే ఈ హీరో గురించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. ప్రశాంత్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆ వార్త సారాంశం. ఈ హీరోకు 2005 లో గృహలక్ష్మి అనే బిజినెస్ మ్యాన్ కూతురితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఇక మూడేళ్ళ తరువాత వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో 2008 లో విడాకులు తీసుకొని విడిపోయారు.

ప్రస్తుతం ప్రశాంత్ ఒంటరిగా ఉంటున్నాడు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడట.. వారి కుటుంబానికి పరిచయం ఉన్న ఒక అమ్మాయిని అతడు వివాహమాడనున్నాడట. తన సినిమా అంధాధూన్ రిలీజ్ అయ్యాక ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించనున్నాడట. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే ప్రశాంత్ నోరు విప్పాల్సిందే.