“బ్రో”లో రియల్ శ్యాంబాబు..అతని ఆధారంగా పెట్టాం – సాయి తేజ్ 

ఇప్పుడు ఏపీ సినీ వర్గాల్లో కంటే రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్న ఏకైక సినిమా పేరు “బ్రో”. గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్రలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా యంగ్ బ్యూటీ కేతిక శర్మ నటించిన ఈ చిత్రాన్ని తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించారు.

అయితే ఈ చిత్రం ఇప్పుడు సినిమా థియేటర్స్ లో కంటే పొలిటికల్ గా ఎక్కువ రన్ అవుతుంది. మరి దీనిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు నన్నే టార్గెట్ చేసి బ్రో సినిమాలో శ్యాంబాబు అనే పాత్రని పెట్టి కించపరిచారు అంటూ గగ్గోలు పెడుతున్నారు. కానీ చిత్ర యూనిట్ మాత్రం అబ్బే అలాంటిది ఏమి లేదు వారు వేరు వీరు వేరు అంటున్నారు.

అయితే అసలు నిజమైన శ్యాంబాబు ఎవరో అనేది తాజాగా సాయి ధరమ్ తేజ్ ఏలూరులో దైవ దర్శనం తర్వాత మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అయితే చెప్పడం వైరల్ గా మారింది. తాము ఏ రాజకీయ నాయకుడిని ఉద్దేశించి బ్రో లో పెట్టలేదు అని అయితే తమ పి ఆర్ గా వర్క్ చేస్తున్న శ్యాంబాబు అనే వ్యక్తిని బేస్ చేసుకొని మా సినిమాలో ఓ ఫన్ రోల్ ని పెట్టామని చెప్పాడు.

దీనితో రియల్ శ్యాంబాబు వేరని క్లారిటీ ఇచ్చాడు. దీనితో తేజ్ క్లారిటీ ఇప్పుడు మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఈ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించగా పీపుల్ మీడియా సంస్థ నిర్మాణం వహించారు.