Prabhas: ఇలా ఉండటం వల్ల చాలా డబ్బు నష్టపోయా…. ప్రభాస్ షాకింగ్ కామెంట్స్!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ తో సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని చోట్ల అభిమానులను సంపాదించాడు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి, ఇటు అస్సాం నుండి గుజరాత్ వరకు ప్రభాస్ మానియా నడుస్తోంది. బాహుబలి తర్వాత వచ్చిన సాహో తో నార్త్ లో మరింత క్రేజ్ సంపాదించారు. సాహో తర్వాత ప్రభాస్ సినిమాలు ఏవి రిలీజ్ అవలేదు. ఇపుడు వరుస సినిమాలతో ప్రభాస్ ఫ్యాన్స్ ను సంతోషపెడుతున్నాడు. ఇక మార్చి 11న రాధే శ్యామ్ ను రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ అన్ని సిద్ధం చేసింది. ఇక ప్రొమోషన్స్ లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ డార్లింగ్ ప్రభ బిజీ అయ్యాడు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను సెటిల్ గా ఉండటం వల్ల చాలా డబ్బు నష్టపోయానని, సినిమాలు కూడా వరుసగా చేయాలనీ భావిస్తున్నట్లు చెప్పారు.

రాధే శ్యామ్ సినిమాలో పూజ హెగ్డే తో నటిస్తున్నాడు. గోపీచంద్ జిల్ సినిమా తీసిన రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రానికి డైరెక్టర్. ఇక ఈ సినిమాను టి -సిరీస్, యు వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇక ప్రాజెక్ట్ కే గురించి వివరాలు వెల్లడించారు. అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించడం గురించి చెప్తూ ఆయనతో కలిసి నటించడం తన కల అని అది ఇప్పటికి నెరవేరిందని చెప్పారు.ఆయనతో కలిసి పడి రోజు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఒక సన్నివేశం అయ్యాక నన్ను అమితాబ్ బచ్చన్ కౌగిలించుకోవడం మర్చిపోలేని సంఘటన అని చెప్పారు.

ఇక ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ఆదిపురుష్ సినిమా తర్వాత ప్రాజెక్ట్ కే, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమా, దాని తర్వాత మారుతీ డైరెక్షన్ లో ఒక సినిమా చేయనున్నారు డార్లింగ్. ఇక పెళ్లి, ప్రేమ గురించి కూడా సరదాగా మాట్లాడారు. ప్రేమించినా అది వర్కౌట్ అవ్వలేదని దాంతో సైలెంట్ అయ్యానని చెప్పారు. ఇక వరుస సినిమాలతో 2022 -23 లో ప్రభాస్ తన అభిమానులను కుషీ చేయనున్నారు.