Gopi Chand: టాలీవుడ్ యంగ్ హీరోగా పిలుచుకునే స్టార్ హీరో గోపీచంద్ ప్రేక్షకులతో ఇటీవలే సీటిమార్ వేయించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ హీరో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సిద్ధమైపోయినట్టు తెలుస్తోంది.
ఐతే ఏ హీరో అయినా ఒకసారి హిట్ కొట్టిన డైరెక్టర్స్ తో మరో సారి కలిసి పని చేసేందుకు ఇష్టపడతారు. అలాంటి మనస్తత్వం ఉన్న నటుల్లో గోపిచంద్ కూడా ఒకరు అని చెప్పవచ్చు.
ఇకపోతే గోపీచంద్ కెరీర్ లో ఇప్పటి వరకూ అంతగా చెప్పుకునేంత స్థాయిలో సినిమాలేవీ చేయకపోయినా, తీసినవన్నీ కూడా ప్రేక్షకులను కొద్దో గొప్పో అలరించాయి. వాటిల్లో గోపీచంద్ కి ఓ హైప్ తెచ్చిన సినిమాల్లో చూసుకుంటే లక్ష్యం, లౌక్యం అని చెప్పవచ్చు. ఈ సినిమాలతో గోపీచంద్ కి హిట్ నీ అందించిన శ్రీవాసుతో మారో సారి జత కట్టేందుకు ఆయన సిద్దం అయ్యారు. మరోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు వారిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం రానుందని సమాచారం. ఐతే ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా, కరోనా కారణంగా కొంత ఆలస్యం అయినట్టు తెలుస్తోంది.
ఐతే ఈ చిత్రానికి లక్ష్యం 2 అనే పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. టైటిల్ ఏంటి అనేది చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో జగపతి బాబు, కుష్బూ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది.
దర్శకుడు శ్రీవాస్ తో మూడవసారి ఓ మూవీ చేయడానికి రెడీ అయిపోయాడు. తాత్కాలికంగా “గోపీచంద్ 30” అనే టైటిల్ తో పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ ను డిసెంబర్ 2021లోనే లాంచ్ చేశారు. అయితే కరోనా కారణంగా ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న చిత్రబృందం ఇప్పుడు సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో డింపుల్ హయాతి కథానాయికగా నటిస్తుండగా, ఓ సీనియర్ హీరోయిన్ కూడా భాగం కానుందని ప్రకటిస్తూ తాజా అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
