Gopichand : గోపీచంద్ పక్కా కమర్షియల్ విడుదల ఎపుడో తెలుసా…!

Gopichand: హీరో గోపీచంద్ కు సరైన విజయం దొరకక చాలా ఏళ్లు అవుతోంది. నటనతో అందరినీ మెప్పిస్తూ ఉన్న దానికి తగ్గ విజయం మాత్రం లభించడం లేదు. ప్రస్తుతం గోపీచంద్ డైరెక్టర్ మారుతి మీదనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ సినిమాను తీస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్ట్రైలర్, టీచర్లకు మంచి ఆదరణ లభించింది.

ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్‌లో ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మిస్తున్నాడు.ఈ మూవీ టైటిల్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈమూవీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు మేకర్స్‌.జులై 1, 2022న పక్కా ఎంటర్‌టైన్‌మెంట్‌తో వస్తున్నామంటూ మేకర్స్‌ అధికారిక ప్రకటన ఇచ్చారు. మారుతి డైరెక్షన్‌లో ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో రాశీ ఖాన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీలో సత్యరాజ్‌, జగపతి బాబులు కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి జేకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.దివంగత రచయిత సీతారామశాస్త్రి రాసిన టైటిల్‌ సాంగ్‌కు అద్భుతమైన స్పందన వస్తోందని చిత్రబృందం తెలిపింది. ఆ పాట విడుదల సమయంలో ఈ చిత్రాన్ని మే 20న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఇప్పుడు ఆ డేట్‌ మారింది. జూలై ఒకటిన ‘పక్కా కమర్షియల్‌ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు దర్శకుడు మారుతి సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ‘జూలై ఒకటిన పక్కా’ అని తెలుపుతూ చిత్రబృందం ఓ పోన్టర్‌ను విడుదల చేసింది.