Gopi Chand: మరోసారి మహేష్ బాబుతో పోటీకి సిద్దమవుతున్న రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదుగా!

Gopi Chand: తొలివలపు సినిమాతో హీరోగా పరిచయమైనా, జయం సినిమాతో తన విలనీజాన్ని చూపించిన గోపీచంద్, మహేష్ బాబుకి దీటుగా నిజం సినిమాలోను, ప్రభాస్ కు పోటీగా వర్షం సినిమాలో తనదైన కొత్త తరహా విలనిజంను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసారు. అయితే అ తర్వాత హీరోగాను యజ్ఞం,లక్ష్యం, ఒంటరి, శౌర్యం, సాహసం, ఆక్సిజన్,చాణక్య వంటి చిత్రాలా ద్వారా కమర్షియల్ హీరో ముద్ర వేసుకున్నాడు. హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు హీరో గోపీచంద్.

తాజాగా సంపత్ నంది డైరెక్షన్ లో వచ్చిన సీటిమార్ సినిమా తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యంలో సాగే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించుకుంది. ప్రస్తుతం మారుతీ డైరెక్షన్ లో ఎంటర్టైన్మెంట్ మరియు కమర్షియల్ హంగులతో ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే చాలా ఏళ్లుగా గోపీచంద్ విలన్ క్యారెక్టర్ కు దూరంగా ఉన్నాడు. కానీ ఇపుడు ఒక భారీప్రాజెక్ట్ లో విలన్ పాత్ర కోసం గోపీచంద్ ను అనుకుంటున్నట్టు సమాచారం.

ఎప్పటినుండో ఎదురుచూస్తున్న మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ ఫిల్మ్ లో విలన్ క్యారెక్టర్ కోసం రాజమౌళి గోపీచంద్ ను సంప్రదించాలని చూస్తున్నట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం. ఇంతకు ముందే మహేష్, గోపీచంద్ కాంబినేషన్ లో వచ్చిన నిజం సినిమాలో ఇద్దరి నటన వావ్ అనిపించుకుంది. ఈ క్రమంలోనే మరో సారి వీరిద్దరి కాంబోలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకుడు రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న గోపీచంద్ నెగిటివ్ పాత్రలో నటించడానికి ఒప్పుకుంటారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.