Paruchuri Brothers: పరుచూరి వెంకటేశ్వరరావు ఆరోగ్యంపై స్పందించిన గోపాలకృష్ణ.. ఆందోళన చెందాల్సిన పనిలేదు!

Paruchuri Brothers: టాలీవుడ్ ఇండస్ట్రీలో పరుచూరి బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారు. ఎన్నో అద్భుతమైన కథలను అందించి రచయితులగా గొప్ప పేరు సంపాదించుకోవడమే కాకుండా నటులుగా, దర్శకుడిగా మంచి గుర్తింపు పొందారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పరుచూరిబ్రదర్స్ గత కొంత కాలం నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా పరుచూరి వెంకటేశ్వరరావు పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈ క్రమంలోనే దర్శకుడు జయంత్ కొద్ది రోజుల క్రితం వెంకటేశ్వర రావుతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా షేర్ చేశారు. వెంకటేశ్వర రావు ఫోటో చూసిన ఎంతో మంది తీవ్ర ఆందోళన చెందారు.

ఈ క్రమంలోనే ఎంతో మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పరుచూరి వెంకటేశ్వరరావు ఏంటి ఇలా మారిపోయారు… ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందా? అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.ఇలా పరుచూరి వెంకటేశ్వరరావు ఆరోగ్యం గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు రావడంతో ఈ వార్తల పై పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు.

ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ స్పందిస్తూ అన్నయ్య వయసు రీత్యా అలా మారిపోయారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఇప్పటికే అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించాము అతను చాలా ఆరోగ్యంగా ఉన్నారని గోపాలకృష్ణ వెల్లడించారు. ఎవరూ కూడా అన్నయ్య ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపారు. ఇలా పరుచూరి వెంకటేశ్వరరావు గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఆ వార్తలపై గోపాలకృష్ణ స్పందిస్తూ అసలు విషయం వెల్లడించారు.