Nagarjuna: ఊటీ లో ఘోస్ట్ తదుపరి షెడ్యూల్.. అప్డేట్ ఇచ్చిన చిత్ర బృందం..!

 

Nagarjuna: బంగార్రాజు మూవీ తో సూపర్ హిట్ అందుకున్న నాగ్..ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో ఘోస్ట్ అనే మూవీ చేస్తున్నాడు.ఈ సినిమాలో నాగార్జున ఒక సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తున్నారు.ఇందులో ముందుగా నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేశారు. అయితే ఆమె గర్భవతి కావడంతో సినిమా నుంచి తప్పుకుంది.కాజల్ స్థానంలోకి సోనాల్ చౌహన్ హీరోయిన్ గా తీసుకున్నారు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ దుబాయ్ లో జరిగింది.అక్కడ కీలక సన్నివేశాల్ని, యాక్షన్ ఘట్టాల్ని చిత్రీకరించాడు దర్శకుడు.

ఈ క్రమంలో ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ.. తదుపరి షెడ్యూల్‌ను ఊటీలో ప్లాన్ చేస్తున్న విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియచేశారు మేకర్స్. ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా నాగ్ సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకోబోతోంది. ఈ ఏడాదే చిత్రం విడుదల కానుంది.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ల పై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్టిల్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.నాగ్ డెడికేషన్‌ను చూసిన ఆయన ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉన్నా కరోనా కారణంగా ఆలస్యమైంది.గరుడవేగ అలాంటి సినిమా తర్వాత ప్రవీణ్ నుంచి వస్తున్న ప్రాజెక్టు కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.