Genelia Deshmukh: తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న జెనీలియా… ఏ హీరో సినిమాలో అంటే?

Genelia Deshmukh: సుమంత్ హీరోగా వచ్చిన సత్యం మూవీతో హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది జెనీలియా దేశ్ ముఖ్. తర్వాత వరుస సినిమాలతో టాప్ హీరోయిన్గా వెలిగింది.సాంబ, సై, నా అల్లుడు, సుభాష్ చంద్రబోస్, హ్యాపీ, బొమ్మరిల్లు, ఢీ, మిస్టర్ మేధావి, రెడీ, ఆరెంజ్, నా ఇష్టం వంటి చిత్రాల్లో నటించింది. బొమ్మరిల్లు సినిమాలోని తన అల్లరితో అందరికీ ఎంతో చేరువైంది.సత్యం, సై, సుభాష్ చంద్రబోస్, బొమ్మరిల్లు, ఢీ, రెడీ వంటి బ్లాక్ బస్టర్ లను తన ఖాతాలో వేసుకుంది. 2012లో దగ్గుపాటి రానా తో తీసిన నా ఇష్టం సినిమా తెలుగులో జెనీలియాకు ఆఖరిది.

జెనీలియా,తుజే మేరీ కసం అనే హిందీ సినిమా ద్వారా 2003లో టాలీవుడ్ లో తన నటనను ప్రారంభించింది. ఈ సినిమాలో రితీష్ దేశ్ ముఖ్ తో కలిసి నటించింది. 2013 లో తను ప్రేమించిన రితీష్ దేశ్ ముఖ్ నీ పెళ్లి చేసుకొని సౌత్ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పింది. పెళ్లి తర్వాత సౌత్ ఇండియన్ మూవీ లో నటించలేదు కానీ మరాఠీ హిందీ సినిమాలలో నటించింది. కాక ఇప్పుడు సినిమాతో సౌత్ సినిమాలో చేయనున్నట్టు ప్రకటించింది.

మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా ఓ చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతోనే జెనీలియా సౌత్ కు రీఎంట్రీ ఇవ్వనున్నట్టుు తెలుస్తోంది. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి వారాహి సంస్థ ద్వారా కిరీటి నీ హీరోగా పరిచయం చేస్తున్నాడు.లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కన్నడ నాట సూపర్ హిట్ అయిన మాయాబజార్ సినిమాను డైరెక్ట్ చేసిన యంగ్అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాధాకృష్ణ ఈమూవీని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

జెనీలియా కిరీటీ మూవీ మేకర్స్ కు ఆల్ ద బెస్ట్ తెలిపింది.”ఇక ఈరోజు దక్షిణాది సినిమాల్లోకి నా రీ ఎంట్రీని సూచిస్తోంది. నా ఇంటిగా భావించే ఇంటికి దూరంగా ఉన్నాను. నన్ను గుర్తుంచుకొని మరీ ప్రత్యేకంగా భాగస్వామిని చేసినందుకు సాయి కొర్రపాటి, రాధాకృష్ణ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.. డెబ్యూ ఫిల్మ్ సందర్భంగా కిరీటీకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీ తొలి చిత్రంలో భాగమైనందుకు సంతోషిస్తున్నాను”అంటూ తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది.