మొట్టమొదటిసారికిగా స్టార్ క్రికెటర్ సినిమా రీ రిలీజ్.!

India national cricket team

లేటెస్ట్ గా టాలీవుడ్ సినిమా దగ్గర రీ రిలీజ్ ల ట్రెండ్ గట్టిగా ఊపందుకున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పటికే పవన్,మహేష్ బాబు, రామ్ చరణ్ ఫ్యాన్స్ తమ సత్తా చాతగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే “సింహాద్రి” రీ రిలీజ్ కి భారీ ప్లానింగ్ లు చేస్తున్నారు.

కాగా ఓ స్టార్ హీరోకి అంటే రీ రిలీజ్ ని సక్సెస్ అవుతుంది అని నమ్మకం ఉంటే ప్లాన్ చెయ్యొచ్చు కానీ బహుశా ఇండియన్ సినిమా దగ్గర ఓ క్రికెటర్ బయోపిక్ సినిమాని అయితే రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ఆ క్రికెటర్ ఎవరో కూడా కాదు.

ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ లో ఏ రాష్ట్ర స్టేడియం లోకి వెళ్లినా కూడా మొత్తం పసుపు మయం చేసేసే ఇమ్మెన్స్ క్రేజ్ ఉన్న క్రికెటర్ ఎం ఎస్ ధోని. బాలీవుడ్ లేటు యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ హీరోగా నీరజ్ పాండే తెరకెక్కించిన ఈ చిత్రం బాలీవుడ్ సహా తెలుగులో కూడా మంచి వసూళ్లు సాధించి హిట్ అయ్యింది.

అయితే ఇపుడు ఈ సినిమాని ఫ్యాన్స్ ఈ ఏడాది ధోని పుట్టినరోజు కానుకగా ప్లాన్ చేసుకొని అయితే సంబరాలు చేసుకోవాలని చూస్తున్నారట. కాగా ఇది ఒక్క తెలుగు రిలీజ్ మాత్రమేనా లేక హిందీలో కూడా ఉందా అనే ఇతర వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఈ ఈ సినిమా ఈ 7వ నెల 7న ఫిక్స్ అయ్యి ఉంది.