“ఎం ఎస్ ధోని” రీ రిలీజ్ లో బిగ్ ఛేంజ్.!

Shraddha Kapoor's name in Sushanth Singh Rajput's issue

సినిమాల్లో హీరోస్ కి ఉన్నట్టుగానే క్రికెటర్స్ లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అనే చెప్పాలి. ఇప్పుడు ఐపీఎల్ చూసుకున్నా కూడా తాను ఏ టీం హోమ్ గ్రౌండ్ లో అడుగు పెట్టినా కూడా అది ధోని హోమ్ గ్రౌండ్ లా అయితే మారిపోతుంది.

మరి ఇంత క్రేజ్ ఉన్నటువంటి ఎం ఎస్ ధోని పై చేసిన సినిమానే “ఎం ఎస్ ధోని అన్ టోల్డ్ స్టోరీ”. దివంగత యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా కియారా అద్వానీ మరియు దిశా పటాని లు హీరోయిన్స్ గా దర్శకుడు నీరజ్ పాండే తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియన్ సినిమా దగ్గర క్రికెటర్ బయో పిక్స్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

మరి అప్పట్లో మంచి వసూళ్లు అందుకున్న ఈ చిత్రం కూడా లేటెస్ట్ ట్రెండ్ లో రీ రిలీజ్ కి వస్తుంది అని ఈ మధ్య టాక్ వచ్చింది. అయితే మొదటగా ఈ సినిమాని ధోని బర్త్ డే కానుకగా ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ వచ్చింది. కానీ లేటెస్ట్ గా అయితే ఈ రీ రిలీజ్ లో బిగ్ ఛేంజ్ వచ్చినట్టుగా తెలుస్తుంది.

ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ మే నెలలోనే రిలీజ్ చేయబోతున్నారట. హిందీ, తెలుగు సహా తమిళ భాషల్లో అయితే ఈ చిత్రం ఈ మే 12న రిలీజ్ చేస్తున్నట్టుగా సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. దీనితో అయితే ఇక ధోని ఫ్యాన్స్ మరోసారి ఈ రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్నారు. మరి ఈ చిత్రం ఇప్పుడు ఎలాంటి వసూళ్లు రాబడుతుందో వేచి చూడాలి. ఇక మరో పక్క అయితే ధోని ఐపీఎల్ సహా తన నిర్మాణంలో వస్తున్న సినిమాలతో బిజీగా ఉన్నారు.