Shekar Master: ఆ అగ్రిమెంట్ కారణంగానే ఢీ షో మానేశాను.. అసలు విషయం బయట పెట్టిన శేఖర్ మాస్టర్!

Shekar Master: ఢీ షో లో కంటెంటేస్ట్ గా తన శేఖర్ మాస్టర్ షో లోనే జడ్జిగా వచ్చాడు. డీ షోలోకి వచ్చిన తర్వాత శేఖర్ మాస్టర్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.ఈ షో ద్వారానే శేఖర్ మాస్టర్ కి చాలా సినిమాలలో కొరియోగ్రఫీ చేసే చాన్స్ కూడా వచ్చింది. ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ మొదటి స్థానంలో ఉన్నారు. టాలీవుడ్ లో ఉన్న సార్ హీరోలందరికీ శేఖర్ మాస్టర్ మంచి మంచి హిట్ సాంగ్స్ అందించారు. అయితే కొన్ని సంవత్సరాలుగా జడ్జిగా వ్యవహరించిన శేఖర్ మాస్టర్ ఢీ షో మానేయటంతో ప్రేక్షకులందరూ నిరాశ చెందారు.

అయితే శేఖర్ మాస్టర్ ఢీ షో మానేయడానికి గల కారణం గురించి శేఖర్ మాస్టర్ పలు ఇంటర్వ్యూలలో అడగగా సినిమా ఛాన్సులు ఎక్కువ రావటం వల్ల టైం సరిపోకపోవడంతో మానేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు. అయినా కూడా శేఖర్ మాస్టర్ ఢీ షో నుండి తప్పుకోవడానికి వేరే ఇతర కారణాలు ఉన్నాయని వార్తలు వినిపించాయి. మొత్తానికి శేఖర్ మాస్టర్ ఈ విషయం గురించి అసలు నిజం బయట పెట్టాడు.

మాటీవీలో టెలికాస్ట్ అవుతున్న కామెడీ స్టార్ షో కి శేఖర్ మాస్టర్ ముందుగానే అగ్రిమెంట్ కుదుర్చుకోవడం వల్ల ఢీ షో కి దూరం కావలసి వచ్చింది అని చెప్పుకొచ్చాడు. తాను ఇంత మంది అభిమానాన్ని సొంతం చేసుకోవడానికి కారణం మల్లెమాల. ఒకవేళ డేట్స్ అడ్జెస్ట్ అయ్యి మల్లెమాల వారు మళ్లీ పిలిస్తే తప్పకుండా ఢీ కి వెళ్తాను అని చెప్పుకొచ్చాడు. శేఖర్ మాస్టర్ మెగాస్టార్ నటించిన ఆచార్య సినిమాలో బలే బలే బంజార అనే పాటకి చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరితో స్టెప్పులు వేయించాడు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది