చెల్లెలు చనిపోయిందని తెలియక పాలు పట్టిన నటి?

ఒకానొక సమయంలో తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర నటిగా కొనసాగిన కె.ఆర్.విజయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో నటిగా సందడి చేసిన ఈమె ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి కె.ఆర్.విజయ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన ఈ సంఘటన గురించి తెలియజేస్తూ అది ఇప్పటికీ తనను ఎంతగానో కృంగదీస్తుందని ఈమె వెల్లడించారు. చిన్నప్పుడు తన చెల్లికి ఒంట్లో బాగోలేక ఎంతో ఇబ్బంది పడింది.అదేసమయంలో తన తల్లికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో మూడు మైళ్ల దూరం ఉన్న డాక్టర్ దగ్గరికి మందుల కోసం పరుగులు తీశానని,అక్కడికి వెళ్లి డాక్టర్ తో ఒంట్లో బాగాలేదని చెప్పాను.అయితే ఎవరికి బాగలేదు ఏం బాగాలేదు అని చెప్పే వయసు కూడా తనది కాదని ఆర్కే విజయ వెల్లడించారు. నా మాటలు విన్న డాక్టర్ తన తల్లికి ఆరోగ్యం బాగా లేదని నిదానంగా వెళ్లి మందులు ఇవ్వవచ్చని అలసత్వం చేశారు.

ఇక డాక్టర్ నేనొచ్చి మందులు ఇస్తానని చెప్పడంతో విజయ ఇంటికి వెళ్లారు.అయితే ఆ సమయానికి తన చెల్లెలు కళ్ళు మూసుకుని పడుకుని ఉండడంతో తనకు ఆకలి వేస్తుందేమోనని తనని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాలు పటిస్తూ ఉండగా అది చూసిన మా బంధువులు పాలు చెల్లెలు నోట్లోకి కాకుండా పక్కకి పోవడం చూసి వాళ్ళు చెల్లెలు చనిపోయిందని భావించారు. ఆ విషయం నాకు తెలియక పాలు పట్టిస్తూ ఉన్నానని విషయం తెలిసి బంధువులు ఒక్కసారిగా గొల్లుమ‌న్నారు. అప్పుడే చెల్లి చనిపోయిందనే విషయం నాకు తెలిసింది.ఆరోజు తన చెల్లి తొడుక్కున్న చొక్కాని తన ప్రతిరూపంగా ఎన్నో రోజులు తన వద్ద భద్రంగా దాచుకున్నానని ఇప్పటికీ ఈ సంఘటన తనని వెంటాడుతూనే ఉందని విజయ వెల్లడించారు.అయితే ఆ రోజు సరైన సమయానికి వైద్యం అంది ఉంటే తన చెల్లెలు బ్రతికి ఉండేది అయితే అప్పుడు పరిస్థితులు అలా ఉండేవని ఈమె ఇంటర్వ్యూ సందర్భంగా తన చిన్నప్పుడు జరిగిన ఈ సంఘటనను బయటపెట్టారు.