Prabhas: బాహుబలి’, సాహో చిత్రాల తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజే మారిపోయింది. అప్పటి వరకూ దేశం వరకూ మాత్రమే ఉన్న ఆయన ఖ్యాతి ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయికి చేరిపోయింది. దీంతో ఆయన చేసే సినిమాలపై రోజురోజుకూ అభిమానుల్లో ఆసక్తి కలిగిస్తోంది. దాదాపు 3ఏళ్ల వెయిటింగ్ తర్వాత మళ్లీ తెరమీద ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో కనిపించిన ప్రభాస్, తరువాత చేయబోయే సినిమాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఆల్మోస్ట్ రూ.350 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నా, విడుదల తర్వాత మాత్రం మిశ్రమ స్పందనే వచ్చింది. అనుకున్న స్థాయిలో లేదనే విమర్శలూ ఈ సినిమాను వెంటాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
ఇకపోతే గ్లోబల్ స్టార్గా ఎదిగిన ప్రభాస్కు బాహుబలి తర్వాతి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందనే చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఆయకున్న అభిమానుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ మార్కెట్ కూడా అంచెలంచెలుగా పెరిగి అత్యధిక పారితోషికం తీసుకునే నటుల జాబితాలో ఒకడుగు ముందే ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన రూ.100కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనే వార్తలు రాగా, ఆయన నెక్స్ట్ నటించబోయే సినిమాలకు ఎంత పారితోషికం తీసుకుంటున్నాడనే వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
అయితే వీటితో పాటు ప్రభాస్ డైరెక్టర్ మారుతీ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కామెడీ, హర్రర్ బ్యాక్డ్రాప్లో రాబోయే ఈ సినిమాకు ప్రభాస్ కేవలం 60రోజుల కాల్షీట్లు మాత్రమే ఇచ్చినట్టు సమాచారం. దీనికి ఆయన ఏకంగా రూ.75కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంటే రోజుకు ఏకంగా రూ. 1.25 కోట్ల వరకు తీసుకోనున్నాడన్నమాట. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ మూవీలో ‘డార్లింగ్’కు జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని టాక్. వీరిలో ఉప్పెన ఫేమ్ కృతీ శెట్టి ఒకరని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆదిపురుష్, సలార్ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ సినిమాలను పూర్తి చేసిన తర్వాత మారుతి సినిమాను సెట్స్పైకి తీసుకువస్తాడని సమాచారం.
