నరేష్ మూడో భార్యకు భరణం కింద ఎన్ని కోట్లు ఇచ్చారో తెలుసా…?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏదైనా హాట్ టాపిక్ ఉందా అంటే అది నరేష్ పవిత్ర లోకేష్ వివాహం అనే చెప్పాలి.నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నరేష్ ఇప్పటికే మూడు వివాహాలు చేసుకుని ముగ్గురు పెళ్ళాలకు విడాకులు ఇచ్చారు.ప్రస్తుతం ఈయన 6 పదుల వయసులో ఉన్నారు అయితే ఈ వయసులో కూడా ఈయన నాలుగో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇదే విషయాన్ని ఈయన సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో నేటిజన్స్ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.పవిత్ర లోకేష్ తో గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే నూతన సంవత్సరం కానుకగా వీరిద్దరూ లిప్ లాక్ కిస్ చేసుకుంటూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించారు.

గతంలో ఈ వ్యవహారంపై నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు విడాకులు ఇవ్వకుండా నరేష్ మరొక మహిళతో ఎలా అక్రమ సంబంధం పెట్టుకుంటారని ఆమె నాన్న రచ్చ చేశారు. అయితే కోర్టులో వీరి విడాకులు పూర్తి కావడంతో నరేష్ పవిత్ర లోకేష్ తో నాలుగో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే వీరిద్దరి విడాకులు మంజూరు కావడంతో నరేష్ తన మూడో భార్యకి ఎంత మొత్తంలో భరణం చెల్లించారు అనే విషయం గురించి చర్చలు మొదలయ్యాయి.

ఇకపోతే నరేష్ రమ్య రఘుపతికి ఒక కుమారుడు ఉన్న విషయం మనకు తెలిసిందే. ఆ కుమారుడికి నరేష్ ఆస్తిలో వాటా ఉంటుంది. అదేవిధంగానరేష్ తన మూడవ భార్యకు విడాకులు ఇచ్చినందుకుగాను ఆమెకు ఐదు కోట్ల రూపాయల భరణం చెల్లించినట్లు సమాచారం. పవిత్ర విషయంలో ఎంతో రాద్ధాంతం చేసిన రమ్య రఘుపతి ఇలా ఐదు కోట్లభరణం తీసుకోవడానికి ఎలా కాంప్రమైజ్ అయ్యారని అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది..