D.J Tillu: ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్న డీజే టిల్లు…. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

D.J Tillu: సిద్ధు జొన్నలగడ్డ నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా విమల్ కృష్ణ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన డీజే టిల్లు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. కామెడీ ఎంటర్ టైన్ మెంట్ తో ఫిబ్రవరి 12వ తేదీ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
థియేటర్లలో టిల్లుగాడి లొల్లికి అందరూ ఫిదా అయ్యారు. ముఖ్యంగా యువత బాగా కనెక్ట్ అయింది. తెలంగాణ యాసలో సిద్ధు చెప్పే డైలాగ్స్, నేహా శెట్టి అందానికి కుర్రకారు ఫిదా అయిపోయారు.

కలెక్షన్ల పరంగా అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా థియేటర్ లో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా థియేటర్ లో ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా ఇకపై ప్రతి ఇంటిలో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని సందడి చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఆహా ద్వారా త్వరలోనే స్ట్రీమింగ్ అవుతున్నట్లు ఈ విషయాన్ని అధికారికంగా ఆహా వెల్లడించారు.

ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. ‘ఇక టిల్లుగాడి లొల్లి ఆహాలో. త్వరలోనే వస్తుంది’ అని అధికారకంగా వెల్లడించడమే కాకుండా
డీజే టిల్లు దుమ్ము ధూలపదానికి వచ్చేస్తున్నాడు. స్క్రాచ్ ఉంటుంది, రెడీగా ఉండండి అంటూ క్యాప్షన్ కూడా జోడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారింది. అయితే ఈ సినిమా ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాన్ని కూడా త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.