రమ్యకృష్ణపై చెప్పులు విసిరారా.. కారణం ఆ హీరోనేనా.. అసలు నిజమేంటి?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత మూడు దశాబ్దాల కాలం నుంచి తిరుగులేని హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో నటి రమ్యకృష్ణ ఒకరు. ఈమె తెలుగులో స్టార్ హీరోలందరి సరసన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా లేడి విలన్ గా కూడా ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రమ్యకృష్ణ దర్శకుడు కృష్ణ వంశీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

హీరోయిన్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ పలు కీలక పాత్రలలో నటిస్తూ ఎనలేని గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిపొందిన బాహుబలి చిత్రంలో శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటనకు విశేష ఆదరణ ప్రశంశలు లభించాయి. ఇలా ప్రస్తుతం పలు సినిమాలలో తల్లి పాత్రలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న రమ్యకృష్ణ పై ఒకానొక సమయంలో థియేటర్ లో ఆమె సినిమా చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆమెపై చెప్పులు విసిరారు. అయితే అలా ఎందుకు విసిరారు ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే…

రమ్యకృష్ణ ,రజనీకాంత్, సౌందర్య ప్రధానపాత్రలో నటించిన సినిమా నరసింహ. ఇందులో రమ్యకృష్ణ నీలాంబరి అనే పాత్రలో నటించారు. నరసింహ సినిమాలో రమ్యకృష్ణ లేడి విలన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. అయితే ఈ సినిమా విడుదల అయినప్పుడు ఒక సందర్భంలో ఈమె రజనీకాంత్ ఎదురుగా కాలుపై కాలు వేసుకుని కూర్చోవడంతో రజనీకాంత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసి ఒక్కసారిగా ఈమె పై చెప్పులు విసిరారు.అయితే మొదటి షోకు రమ్యకృష్ణ చెల్లి థియేటర్ కు వెళ్లడంతో ఈ సంఘటన జరగగా వెంటనే ఈ విషయం రమ్యకృష్ణ చెప్పడంతో ఆమె ఎంతో బాధపడ్డారని అయితే ఈ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ కావడంతో రమ్యకృష్ణకు ఎంతో మంచి పేరు వచ్చిందనీ చెప్పవచ్చు.