వీర సింహారెడ్డి కథ బాలయ్య కంటే ముందుగా ఆ మెగా హీరో వద్దకు వెళ్లిందా… ఎందుకు రిజెక్ట్ చేశారో తెలుసా?

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్నటువంటి చిత్రం వీర సింహారెడ్డి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.ఇక ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి ఒక్కొక్క అప్డేట్ విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలు పెంచారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ నటించిన విషయం మనకు తెలిసిందే.మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గోపీచంద్ సిద్ధం చేసుకున్నటువంటి ఈ స్క్రిప్ట్ బాలకృష్ణ కంటే ముందుగా మెగా కాంపౌండ్ వరకు వెళ్లి వెనక్కి వచ్చిందని సమాచారం. ఈ సినిమా కోసం ముందుగా గోపీచంద్ మెగా హీరో అయినటువంటి రామ్ చరణ్ కోసం ఈ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా రామ్ చరణ్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా సమయంలోనే స్క్రిప్ట్ మొత్తం రామ్ చరణ్ కు వినిపించారట.

కథ మొత్తం విన్నటువంటి రామ్ చరణ్ ఈ సినిమాకు కమిట్మెంట్ ఇవ్వకుండా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఇవ్వడమే కాకుండా క్లైమాక్స్ కొద్దిగా చేంజెస్ చేయాలని సూచించారట.అయితే గోపీచంద్ ఎంతో ఇష్టంగా రాసుకున్నటువంటి ఈ స్క్రిప్ట్ క్లైమాక్స్ చేంజ్ చేయడానికి ఏమాత్రం ఇష్టపడకపోవడంతో తిరిగి ఈ కథతో గోపీచంద్ రామ్ చరణ్ వద్దకు వెళ్లకుండా సరాసరి బాలయ్య వద్దకు వెళ్లారట.ఈ కథ విన్నటువంటి బాలకృష్ణ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సినిమాకి కమిట్ అయ్యారని తెలుస్తుంది.ఇలా రామ్ చరణ్ నటించిన వీర సింహారెడ్డి సినిమా బాలకృష్ణ వద్దకు వెళ్ళింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాలను అందుకుంటుందో వేచి చూడాలి.