రోజా కారణంగానే నాగబాబు జబర్దస్త్ వదిలి పెట్టారా… క్లారిటీ ఇచ్చేసిన మంత్రి రోజా?

వెండితెరపై ఎన్నో సినిమాలలో హీరోయిన్గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రోజా తెలుగులో అగ్ర హీరోలు అందరికీ సరసన నటించిన బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నారు.ఇలా ఎన్నో అద్భుతమైన తెలుగు తమిళ భాషలలో హీరోయిన్గా నటించిన రోజా అనంతరం రాజకీయాలలోకి వచ్చారు.ఇలా రాజకీయాలలో కూడా మొదట్లో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఈమె వైసిపి పార్టీలోకి వచ్చిన తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఇదే పార్టీలో మంత్రిగా కొనసాగుతున్నారు.

ఇకపోతే రోజా రాజకీయాలలోకి వచ్చి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోను ఈమె బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.ఈ కార్యక్రమానికి నాగబాబుతో కలిసి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నటువంటి రోజా దాదాపు తొమ్మిది సంవత్సరాలపాటు ఈ కార్యక్రమంలో జడ్జిగా కొనసాగారు. అయితే నాగబాబు మాత్రం మధ్యలోనే ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు.

ఈ విధంగా నాగబాబు ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడానికి రోజానే కారణమని, వీరిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్ధలు కారణంగా నాగబాబు జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పకున్నారనే వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన మంత్రి రోజా ఈ విషయం గురించి మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. తనకు నాగబాబు గారికి ఏ విధమైనటువంటి మనస్పర్ధలు లేవని ముఖ్యంగా నా వల్ల ఆయనకు ఎలాంటి విభేదాలు గానీ ఇబ్బందులు కానీ తలెత్తలేదని తెలిపారు.నాగబాబు గారు జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్లిపోవటానికి తనకు ఏమాత్రం సంబంధం లేదని ఈమె క్లారిటీ ఇచ్చారు.